తెలుగుదేశం పార్టీకి (టీడీపీ) చెందిన 45 మంది నేతలపై చిత్తూరు జిల్లా రామకుప్పం పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. నమోదైన వారిలో తెలుగుదేశం అధినేత ఎన్.చంద్రబాబు నాయుడు వ్యక్తిగత కార్యదర్శి పి.మనోహర్ కూడా ఉన్నారు.
గత వారం రామకుప్పం మండలం ఉనిసిగానిపల్లె మాజీ సర్పంచ్ మహాదేవి, ఆమె భర్త జయశంకర్పై కుప్పం కోర్టులో సబ్ ఇన్స్పెక్టర్ బెదిరింపులకు పాల్పడ్డారు.
దీంతో ఎస్ఐ వ్యాఖ్యలను ఖండిస్తూ టీడీఎస్ నాయకులు బుధవారం పోలీస్స్టేషన్ ఎదుట బైఠాయించారు.
విధులు నిర్వర్తించకుండా పోలీసులను తెలుగుదేశం నేతలు అడ్డుకున్నారని హెడ్ కానిస్టేబుల్ మణి ఫిర్యాదు మేరకు రామకుప్పం పోలీసులు నిరసనకారులపై కేసు నమోదు చేశారు.