గురువారం గాంధీభవన్లో పలువురు కాంగ్రెస్ నేతలు అసెంబ్లీ స్థానాలకు దరఖాస్తులు దాఖలు చేశారు. ఆగస్టు 18 నుంచి పార్టీ దరఖాస్తులు స్వీకరించగా గురువారం చివరి రోజు.
పార్టీకి ఇప్పటివరకు 700కు పైగా దరఖాస్తులు అందగా, అందులో గురువారం 200కి పైగా దరఖాస్తులు వచ్చాయి. కొడంగల్ నుంచి టీపీసీసీ అధ్యక్షుడు ఎ. రేవంత్రెడ్డి, జగిత్యాల నుంచి టి.జీవన్రెడ్డి, జనగాం నుంచి పొన్నాల లక్ష్మయ్య, కామారెడ్డి నుంచి షబ్బీర్ అలీ, కె. జానా రెడ్డి తనయుడు కె. రఘువీరారెడ్డి తదితరులు నేతలు తమ పత్రాలను దాఖలు చేసారు.
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సోదరుడి కుమార్తె రేగులపాటి రమ్యరావు కరీంనగర్ స్థానానికి దరఖాస్తు చేసుకున్నారు.
- Read more Political News