Actress Vishnupriya : బుల్లితెర నటి విష్ణుప్రియ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె తండ్రి అనారోగ్యంతో హఠాత్తుగా మరణించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా విష్ణు ప్రియే స్వయంగా వెల్లడించింది. తండ్రి మరణంతో చాలా ఎమోషనల్ పోస్టును పెట్టింది.కొండంత అండను కొల్పొయానంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు తండ్రితో ఉన్న ఫొటోను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ.. తన హృదయం ఈ గాయం నుంచి ఎప్పటికీ కోలుకోలేదని.. తన సూపర్ హీరో, బిగ్గెస్ట్ బ్లెస్పింగ్ను కోల్పోయానని తెలిపింది.
ప్రతి క్షణం తన తండ్రిని మిస్ అవుతూనే ఉంటానని విష్ణు ప్రియ వెల్లడించింది. విష్ణు ప్రియ తండ్రి గత కొద్ది రోజులుగా కామెర్ల వ్యాధితో బాధ పడుతున్నారు. కాగా.. వారం రోజులుగా ఆయన ఆసుపత్రిలో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. అయినా కూడా ఫలితం దక్కలేదు. ఆయన మరణించారు. ఈ కష్టకాలంలో తనకు అండగా ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసి విష్ణు ప్రియ భావోద్వేగానికి లోనయ్యింది.
ఈమె ఒక యూట్యూబ్ ఛానల్ను సైతం నిర్వహిస్తోంది. ఈ యూట్యూబ్ ఛానల్లో అప్పుడప్పుడు తన తండ్రితో కలిసి కనిపిస్తూ ఉంటుంది. తన తండ్రి చేసిన ఒక రెసిపీని యూట్యూబ్ ఛానల్లో ఇటీవల పెట్టింది విష్ణుప్రియ. కాగా.. విష్ణుప్రియ తన సీరియల్ కో-స్టార్ సిద్ధార్థ్ వర్మను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అభిషేకం, కుంకుమ పువ్వు, ఇద్దరు అమ్మాయిలు వంటి సీరియల్స్తో తెలుగులో ఆమె నటిగా మంచి గుర్తింపు పొందింది. ప్రస్తుతం విష్ణుప్రియ తెలుగులో త్రినయని, జానకి కలగనలేదు వంటి సీరియల్స్లో నటిస్తోంది.