ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి రాష్ట్రంలో బాలికలు, మహిళల మిస్సింగ్ కేసులపై రియాక్ట్ అయ్యారు. 2019- 21 మధ్య 26 వేల మంది బాలికలు, మహిళలు అదృశ్యమైతే.. 23 వేల మంది తిరిగి వచ్చేశారని ఆయన చెప్పారు. అంతకు ముందు సంవత్సరాల్లో తప్పిపోయిన వారిని కలపటం వల్లే 30 వేల మంది అని లెక్కలు చెబుతున్నారని డీజీపీ అన్నారు.
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మహిళలు, బాలికల మిస్సింగ్పై రాజ్యసభలో కేంద్ర హోం శాఖ వివరాలు వెల్లడించిన విషయం తెలిసిందే. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా రాజ్యసభలో ఎదురైనా ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో మహిళలు, బాలికల అదృశ్యంపై రాజ్యసభలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా సమాచారం ఇచ్చారు.
![డీజీపీ: 30 వేల మంది మహిళల మిస్సింగ్ నిజమే 2 డీజీపీ: 30 వేల మంది మహిళల మిస్సింగ్ నిజమే](https://rtvmedia.in/wp-content/uploads/2023/07/tb-1-1.png)
మంది బాలికలు, 22,278 మంది మహిళలు, యువతులు కనిపించకుండా పోయారని రాజ్యసభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్కుమార్ మిశ్రా లిఖితపూర్వకంగా వివరించారు. ఈ నేపథ్యంలో శాంతిభద్రతలపై వైఎస్సార్ జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసు యంత్రాంగం కృషి చేస్తోందని వెల్లడించారు. ఇందు కోసం అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని పేర్కొన్నారు