Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్రాజు పేరు ఇప్పుడు ట్విట్టర్లో ఓ రేంజ్లో ట్రెండ్ అవుతోంది. నెటిజన్లు ఆయనకు ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 36 వేల ట్వీట్లు వచ్చాయి. ‘దిల్రాజు గారు మా బాధ వినండి’ అంటూ నెటిజన్లు ట్వీట్ల మోత మోగిస్తున్నారు. అదేంటి.. ఇంత సడెన్గా దిల్ రాజు అంత వైరల్ అవడానికి కారణమేంటి అనుకుంటున్నారా? కారణం ఉంది.. మెగా పవర్ స్టార్ రామ్చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తుంది. దిల్రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ గత ఏడాది సెప్టెంబర్ 8న ప్రారంభమైంది. ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఒకే ఒక్క పోస్టర్ మినహా ఇంత వరకూ మూవీ టీం ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ సినిమాకు సంబంధించి ఎన్నో ఊహాగానాలు వైరల్ అవుతున్నాయి. షూటింగ్ ప్రారంభించి ఏడాది కావొస్తున్నా RC15 నుంచి మాత్రం అప్డేట్స్ ఏమీ లేవు. దీంతో ట్విట్టర్ వేదికగా మెగా అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దిల్రాజును ట్యాగ్ చేస్తూ అప్డేట్స్ ఇవ్వాలని కోరుతున్నారు. దీంతో దిల్రాజు పేరు ట్విట్టర్లో ట్రెండింగ్లోకి వచ్చింది.
Dil Raju : ఆ ఘనత కూడా చెర్రీకే దక్కింది..
రాజమౌళి దర్శకత్వంలో చేసిన హీరో.. ఇప్పటి వరకూ శంకర్ డైరెక్షన్లో నటించింది లేదు. ఇదొక రికార్డ్ కాగా.. ఇటీవలి కాలంలో చెర్రీ సినిమాలు ఒకే క్యాలెండర్ ఇయర్లో రెండు విడుదలైంది లేదు. కానీ ఈ ఏడాది ఆర్ఆర్ఆర్, ఆచార్య రెండూ విడుదలయ్యాయి. ఈ రెండూ మల్టీస్టారర్ చిత్రాలే కావడం విశేషం. ఒక సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొడితే.. మరో సినిమా డిజాస్టర్గా నిలిచింది. ఇక శంకర్ తమిళ, హిందీ హీరోలతో తప్పించి ఓ తెలుగు హీరోతో ఇంత వరకు ఒక్క సినిమా కూడా తెరకెక్కించలేదు. ఆ ఘనత కూడా చెర్రీకే దక్కింది. వీళ్లిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్నిదిల్ రాజు భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేయనున్నట్టు టాక్. రామ్ చరణ్.. తండ్రి.. ఇద్దరు కుమారులుగా నటించబోతున్నట్టు తెలుస్తోంది.