ఐశ్వర్య రాజేష్.. ఈ అమ్మడు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేని పేరు.కౌసల్య కృష్ణ మూర్తి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది.ఈ సినిమాలో అమ్మడు తన నటన ప్రేక్షకులను మెప్పించింది.ఆ తర్వాత తమిళ్ సినిమాల్లో వరుసగా నటించింది.
తాజాగా ఈమె ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.ముఖ్యంగా స్టార్ హీరోల సినిమా లో కనీసం ఒక్క తెలుగు అమ్మాయి హీరోయిన్ గా నటించిన దాఖలాలు లేవు.అయినా తెలుగు అమ్మాయిలు హీరోయిన్ గా ప్రయత్నాలు చేస్తూనే వస్తున్నారు.టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ గా ప్రయత్నాలు చేస్తూనే ఉండగా కొందరికి చిన్న హీరోలకు జోడిగా నటించే అవకాశాలు లభిస్తున్నాయి అంటూ చెప్పుకొచ్చింది.
తెలుగు మూలాలు ఉన్న అమ్మాయి అయినా ఐశ్వర్య రాజేష్ తమిళం లో సక్సెస్ఫుల్ హీరోయిన్ గా స్టార్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకుంది.అయితే ఈమె కి కూడా తమిళనాడు లేదా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలకి జోడి గా నటించే అవకాశాలు మాత్రం రావడం లేదు.
తెలుగమ్మాయి అయినా ఐశ్వర్య రాజేష్ ఎవరో కాదు ప్రముఖ నటుడు రాజేష్ కూతురు అలాగే ప్రముఖ సీనియర్ లేడీ కమెడియన్ శ్రీ లక్ష్మి మేనకోడలు.. ఇక తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావడం లేదు అని చెప్పి మరోసారి షాక్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.