హైదరాబాద్లోని రాజాసింగ్ నివాసానికి వెళ్లి ఆయనతో ఈటల రాజేందర్ సమావేశమయ్యారు. దీంతో రాజాసింగ్ బీఆర్ఎస్లో చేరతారనే ప్రచారం జరగ్గా… ఈ వార్తలను ఆయన ఖండించారు.
హరీష్ రావును రాజాసింగ్ కలిసిన నేపథ్యంలో ఇప్పుడు ఈటల రంగంలోకి దిగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సస్పెన్షన్ వేటు గురించి చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. రాజాసింగ్పై విధించిన సస్పెన్షన్ తొలగించాల్సిందిగా గతంలో ఢిల్లీ అధిష్టానానికి బండి సంజయ్ పలుమార్లు లేఖలు రాశారు.
దీంతో రాజాసింగ్పై సస్పెన్షన్ను తొలగిస్తారా? లేదా? అనేది అంశంపై ఆయన అభిమానుల్లో కన్ప్యూజన్ నెలకొంది. అయితే సస్పెన్షన్ విధించి ఏడాది గడిచినా ఇప్పటివరకు బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో.. రాజాసింగ్కు పలు పార్టీల నుంచి ఆహ్వానాలు అందుతున్నాయి. ఇప్పటికే తమ పార్టీలో చేరాల్సిందిగా టీడీపీ, బీఆర్ఎస్ ఆయనను ఆహ్వానించాయి. కానీ తాను బీజేపీలోనే పుట్టానని, చచ్చేవరకు ఆ పార్టీలోనే ఉంటానని రాాజాసింగ్ చెబుతున్నారు. వేరే పార్టీలోకి వెళ్లే ఆలోచన తనకు లేదని చెప్పుకొస్తున్నారు.