గవర్నర్ తమిళిసై సౌదర రాజన్ ప్రభుత్వంలో టీఎస్ ఆర్టీసీ విలీనానికి సంబంధించిన బిల్లుపై స్పంనందించడం జరిగింది. టీఎస్ ఆర్టీసీ బిల్లు పరిశీలించడానికి కొంత సమయం కావాలని ఈ బిల్లు బుధవారం మధ్యాహ్నం రాజ్భవన్కు చేరిందని తెలిపారు. బిల్లుపై ఉన్న సందేహాల పట్ల న్యాయ సలహాలు సేకరించాల్సిన అవసరం ఉందని.. అందుకు కొంత సమయం పడుతుందని అన్నారు.
ఇదిలా ఉంటే.. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశ పెట్టాలని కేసీఆర్ సర్కార్ భావించింది. కాగా.. ఇది ఆర్థికపరమైన బిల్లు కావడంతో పద్ధతి ప్రకారం గవర్నర్కు పంపించింది. టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటమే కాకుండా.. సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని.. ఇటీవల సమావేశమైన కేబినెట్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ నిర్ణయానికి అనుగుణంగా సర్కారు బిల్లు రూపొందించింది. కానీ.. అసెంబ్లీలో ఈ బిల్లును ప్రవేశపెట్టేందుకు ఇప్పటికీ గవర్నర్ తమిళిసై నుంచి అనుమతి రాలేదు
బిల్లును గవర్నర్కు పంపించి రెండు రోజులు పూర్తి కావస్తున్నా .. ఇంకా ఆమోదం తెలపకపోవటంతో బిల్లు ప్రవేశపెట్టేందుకు ఆలస్యం అవనుంది.
మరోవైపు… ఈ అసెంబ్లీ సమావేశాలు కేవలం మూడు రోజులు మాత్రమే నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. కేవలం ఒక్క రోజు సమయం ఉండడంతో . గవర్నర్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో .. మరి అసెంబ్లీ సమావేశాల గడువు ఇంకా పొడిగిస్తారా లేదా అన్నది రాజకీయ పరంగా ఆసక్తిగా మారింది.