రైతులకు 24 గంటల ఉచిత కరెంట్పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. అధికార పార్టీ బీఆర్ఎస్తో పాటు సొంత పార్టీ కాంగ్రెస్ లోనూ ఆయన చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తున్నారు. ఇటీవలే ఆర్థకశాఖ మంత్రి హరీష్ రావు కూడా ఈ విషయంపై స్పందించారు. రైతు వ్యతిరేక కాంగ్రెస్ పార్టీకి ధరణి వద్దు.. రైతు బంధు వద్దు.. ఉచిత కరెంట్ వద్దు అని హరీష్ ట్వీట్ చేశారు. ఈ వచ్చే ఎన్నికల్లో రైతులు కచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి కరెంట్ షాక్ ఇచ్చితీరాలని అన్నారు. .
నాడు తెలంగాణ ఉద్యమంపై తుపాకీ ఎక్కుపెట్టిన మనిషే, నేడు పచ్చబడ్డ తెలంగాణను చూసి విషం చిమ్ముతున్నడు. పార్టీ మారినా మనిషి మారలేదు.. మనసు కరగ లేదు అసలు రేవంత్ రెడ్డి కి తెలంగాణ మీద అభిమానం గని తెలంగాణ రైతుల మీద ప్రేమ గని లేదని మండిపడ్డారు హరీష్ రావు. తెలంగాణ సమాజంపై పగబట్టినట్టు వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ అధ్యక్షుడికి రైతులు తగిన రీతిలో బుద్ధి చెప్పాలని,. రైతన్నకు కరెంట్ అనవసరం అని చెప్పిన కాంగ్రెస్ నాయకులకు వచ్చే ఎన్నికల్లో కరెంట్ షాక్ ఇవ్వాలి.” అని మంత్రి హరీష్ ట్వీట్ చేశారు
మరోవైపు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఉచిత కరెంట్ కోసం ఉమ్మడి రాష్ట్రంలో చాలా కష్టపడ్డామన్నారు. ఆయన ఏ ఉద్దేశ్యంతో ఆలా అన్నాడో తెలియదు కానీ.. అలా అనటం మాత్రం కరెక్ట్ కాదన్నారు. రేవంత్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని చెప్పారు.