కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో అవినీతి జరిగిందని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై తెలంగాణ ఆర్థిక మంత్రి టి. హరీష్ రావు విమర్శించారు, గాంధీ వాదనలు ఆయన అజ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నాయి అన్నారు.
‘‘ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.80 వేల కోట్లు ఖర్చు చేసిందని.. రూ.లక్ష కోట్ల కుంభకోణం జరిగిందని రాహుల్ గాంధీ అంటున్నారని.. ప్రాజెక్టు వ్యయమే రూ.80 వేల కోట్లు ఉన్నప్పుడు రూ.లక్ష కోట్ల కుంభకోణం ఎలా సాధ్యమైంది? ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేయడం ద్వారా రాహుల్ తన అజ్ఞానాన్ని చూపిస్తున్నారు’’ అని మంత్రి మండిపడ్డారు.
ప్రతిపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు పెరుగుతున్న ప్రజాదరణను అంగీకరించలేకపోవడమే ఇందుకు కారణమన్నారు. తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలు తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలు చేయలేని వాగ్దానాలు చేస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.
తెలంగాణ రైతులకు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాముఖ్యతను ఎత్తిచూపిన ఆయన, ‘‘కాళేశ్వరం ప్రాజెక్టు లేకుండా గత రబీ సీజన్లో తెలంగాణ రైతులు 56 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయలేకపోయేవారు. గత రబీ సీజన్లో వరి సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.26,000 కోట్లు వెచ్చించింది అని అయన అన్నారు.