మన దేశంలో జమిలి ఎన్నికలు ఫిబ్రవరిలో నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. దీని గురించి బీజేపీ తెర వెనుక అతి పెద్ద కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది . ఒకేసారి పన్నెండు రాష్ట్రాలతో పాటుగా లోక్ సభ కు ఎన్నికలు ఒకేసారి నిర్వహించేలా ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా బీజేపీ జాతీయ నాయకత్వం చూస్తుందని తెలిపారు.
ఈ ఏడాది డిసెంబర్ లో అయిదు రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించనున్నారు .అందులో ముఖ్యంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణా, చత్తీస్ ఘడ్ వంటి రాష్ట్రాలు ఉన్నాయి. వచ్చే ఏడాది ఏపీ, ఒడిశా, మహారాష్ట్ర వంటివి ఉన్నాయి. ఇలా వీటన్నింటినీ కలుపుకుంటే ఒక డజన్ రాష్ట్రాలకు ఫిబ్రవరిలో ఎన్నికలు పెట్టాలని 2024 కేంద్రంలోని బీజేపీ ఆలోచిస్తోందని అంటున్నారు. ఈ ఆలోచన కూడా చాలా సీరియస్ గానే ఉంటుంది అని అంటున్నారు.
జమిలి ఎన్నికలు అంటే లోక్ సభ ఎన్నికలు ఆయా రాష్ట్రాలకు కూడా ఉంటాయి. కాబట్టి తెలంగాణా మధ్యప్రదేశ్ చత్తీస్ ఘడ్ లలో వారికి కొంత డౌట్ ఉంది. మోడీ ఇమేజ్ బాగా వర్కౌట్ అయి రాష్ట్రాలలో కూడా బీజేపీకీ గెలుపు అవకాశాలు రెట్టింపు అవుతాయ అని కమలనాధులు స్కెచ్ గీస్తున్నారు. వైసీపీకి కూడా ఫిబ్రవరిలో ఎన్నికలు అంటే జస్ట్ రెండు మూడు నెలలు అధికారం మాత్రమే ఉంది. కాబట్టి వారు కూడా ఓకే అంటారని అంటున్నారు.
అదే విధంగా ఒడిశా కూడా అంగీకరించవచ్చుని భావిస్తున్నారు. బీజేపీ అగ్ర నాయకత్వం జమిలి ఎన్నికల మీదనే ప్రస్తుతం ఫోకస్ పెట్టి వేగంగా పావులు కదుపుతోంది. అనుకున్నదే జరిగితే బీజేపీకి విజయావకాశాలు ఎంతవరకూ ఉంటాయో చూడాలి మరి. అలాగే ఫిబ్రవరి ఎన్నికలకు వైసీపీ రెడీగా ఉందనే అంటున్నారు. ఇక ఏపీ రాజకీయాల్లో టీడీపీ మరియు జనసేన కూడా ముందస్తు ఎన్నికలకు పూర్తి స్థాయిలో సన్నాహాలు చేసుకుంటున్నాయి..