Jayavani : ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడం ఒక ఎత్తైతే.. అడుగు పెట్టాక నిలదొక్కుకోవడం మరో ఎత్తు. ఈ మధ్యకాలంలో బ్యాక్గ్రౌండ్ బలంగా ఉన్న వారి పరిస్థితి గురించి పెద్దగా మాట్లాడుకునేందుకు ఏమీ ఉండదు కానీ.. లేని వారి పరిస్థితి మాత్రం దయనీయం. ఇటీవలి కాలంలో పలువురు క్యారెక్టర్ ఆర్టిస్టులు తాము ఎదుర్కొన్న అవమానాలను వెల్లడించి కెమెరా ఎదుట కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు చాలానే కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే.. నటి జయవాణి తాను ఎదుర్కొన్న అవమానాలు, ఇబ్బందులను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ సందర్భంగా సినిమాల్లోకి రావడానికి ముందు అంటే అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ తిరుగుతున్న సమయంలో తను ఎదుర్కొన్న ఓ దారుణ ఘటనను ఆమె వెల్లడించారు.
Jayavani : ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా..
మూవీ అవకాశం కోసం ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఫోన్ చేస్తే ఓ ఆఫీస్కు వెళ్లానని.. ఓ డ్రెస్లో తన ఫొటోలు తీసుకున్నారని జయవాణి తెలిపారు. వాళ్లు కొన్ని ఫొటోలు తీసుకున్న తరువాత అక్కడి నుంచి వచ్చేశానని.. మళ్లీ వాళ్లు తనకు ఇప్పటివరకు కాల్ చేయలేదన్నారు. కానీ కొద్ది రోజులకు ఆ ఫొటోలు ఇంటర్నెట్లో కనిపించాయన్నారు. అవి చూసి షాకైన తాను.. ఆరా తీద్దామని వెంటనే తనను ఫోటోలు తీసిన ప్రదేశానికి వెళితే అక్కడ ఎవరూ లేరన్నారు. ఆ ఫొటో షూట్కు సంబంధించిన పిక్స్ మాత్రం నెట్లో అలానే ఉన్నాయని.. ఎవరు పెట్టారో కూడా తనకు ఇప్పటికీ తెలియదని జయలక్ష్మి వివరించారు. ఈ క్రమంలోనే టాలీవుడ్లో నిలదొక్కుకునేందుకు పడరాని పట్లు పడ్డానని.. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని.. జయవాణి వెల్లడించారు.
యమదొంగ, మర్యాద రామన్న, విక్రమార్కుడు, గుంటూర్ టాకీస్ వంటి సినిమా ద్వారా జయవాణి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో నల్లగా ఉన్నావని చాలా మంది అవమానించారని చెప్పారు. నటిగా సెట్కానని అన్నారని.. కానీ తాను మాత్రం ఎలాగైనా ఇండస్ట్రీలోనే కొనసాగాలని చాలా కష్టపడ్డానని అన్నారు. ఏ చిన్న క్యారెక్టర్ ఇచ్చినా చేసేదాన్నని.. వచ్చిన పాత్రకు వంద శాతం న్యాయం చేశానన్నారు. ప్రస్తుతం డైరెక్టర్లను కామెడీ రోల్స్ ఇవ్వమని అడుగుతున్నట్టు తెలిపారు.