కొడుకులు, కొడళ్లకి శోభనం విజయవంతంగా జరిపించానని సంతోషపడుతుంది జ్ఞానాంబ.. త్వరలో ఇంటికి వారసులు రాబోతున్నారని సంబరపడి పోతుంది. ఆ విషయాన్ని భర్త గోవిందరాజులుతో పంచుకుంటుంది. అయితే.. మల్లిక కంటే ముందే జానకి పిల్లలు పుట్టాలని కోరుకుంటుంది. లేకపోతే జనాలు జానకికి లోపం ఉందని అనుకుంటారని.. అలా జరగకూడదని కోరుకుంటుంది. అది చాటుగా విన్న జానకి బాధపడుతుంది. ఇక జూలై 15 ఎపిసోడ్ లో ఏమి జరిగిందో చూద్దాం..
అత్తయ్య మాటలు విన్న జానకి చాలా బాధపడుతుంది. అలానే గతరాత్రి శోభనం గదిలో జరిగిన విషయాలను గుర్తు తెచ్చుకుంటుంది. వారి మధ్యలో రొమాన్స్ ముదిరి దగ్గరవుతున్న సమయంలోనే జానకి పుస్తకాలు కిందపడి తెలివిలోకి వస్తారు జానకి రామా. మిమ్మల్ని ఐపిఎస్ కలకి నేను అడ్డు రాకూడదనే బుక్ కింద పడిందని అంటాడు రామా. అది విని తన కలని భార్యగా తన బాధ్యతని ఒకేసారి మ్యానేజ్ చేయగలను అంటుంది జానకి. అది సాధ్యం కాదని కోపంగా వెళ్లి మంచంపై పడుకుంటాడు రామా.
ఒకవైపు అత్తయ్య గారు నాపై పెట్టుకున్న నమ్మకం.. మరోవైపు నా కలను నాకు అందించడం కోసం మీరు పడుతున్న ఆరాటం.. ఏం చేయాలో అర్ధం కావడం లేదు.. మానసికంగా నలిగిపోతున్నాను.. నమ్మించడం కోసం నాటకాన్ని మొదలుపెడుతున్నాను క్షమించండి అని శోభనం రాత్రి రామా కాలుని తనపై వేసుకుని ఏదో జరిగిందని అతన్ని నమ్మించిన విషయాన్ని గుర్తు చేసుకుంటుంది జానకి.
అత్తయ్య గారు నాపైన.. నేను ఇచ్చిన మాటపైన నమ్మకంగా ఉన్నారు.. నా నుంచి శుభవార్త వింటానని ఆశతో ఉన్నారు.. త్వరలోనే ఈ ఇంటికి వారసుడు వస్తాడని ఆనందంలో ఉన్నారు.. అత్తయ్య గారు బాధపడతారని అబద్ధం చెప్పాను.. కానీ అసలు విషయం తెలిస్తే ఇంకా బాధపడతారు. అన్నింటికీ మించి అత్తయ్య గారి దగ్గర నమ్మకాన్ని కోల్పోయిన దాన్ని అవుతాను. అది జరిగితే నా ముఖం కూడా చూడరు. అత్తయ్యకి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోడలుగా నా ధర్మం.. అత్తయ్యని ఇక మోసం చేయలేను.. అని అనుకుంటుంది జానకి.
ఇక షాప్ కి వెళ్లిన రామా శోభనం రాత్రి గురించే ఆలోచిస్తూ ఉంటాడు.. ఇంతలో జానకి ఫోన్ చేస్తుంది.. ఫోన్ ఎత్తినా రామాని ఏంటి శ్రీవారు.. ఏం చేస్తున్నారని అడుగుతుంది. ఏంలేదు కానీ ఎందుకు కాల్ చేశారని అడుగుతాడు రామా. నాకైతే మీరే గుర్తొస్తున్నారు శ్రీవారు.. మీ ముద్దు మురిపాలు.. చిలిపితనం అల్లరి.. గుర్తుకొస్తోంది అని చిలిపిగా అంటుంది జానకి. దానికి.. నాకు మన మధ్య ఏం జరగలేదు.. రాత్రి అయ్యిదంతా తూచ్ అని అంటాడు. దీంతో జానకి.. బుంగమూతి పెట్టి.. చేసిందంతా చేసి తూచ్ అంటారేంటి.. సాయంత్రం ఇంటికి రండి మీ సంగతి చెప్తా.. ఇంకో విషయం ఇంటికి వచ్చేప్పుడు.. ఐదుమూరల మల్లెపూలు తీసుకు రండి అంటుంది. దానికి అన్ని పూలు దేవుడు పూజ కోసమా అని అమాయకంగా అడుగుతాడు రామా.. వెంటనే పూలు ఆ దేవి పూజ కోసం కాదు.. మీ దేవి పూజ కోసం.. విడిపూలు మంచంపై చల్లడానికయ్యా అని జానకి కొంచెం గడుసుగా మాట్లాడుతుంది. అయ్యో జానకి గారు అలా మాట్లాడుతున్నారు ఏంటండీ? అని అమాయకంగా అడుగుతాడు. దానికి.. భార్యాభర్తలు అంటే ఇలాగే మాట్లాడుకోవాలి.. ఏమయ్యా.. నీకోసం ఎదురుచూస్తూ ఉంటాను.. అంటూ రామాను ఇంకా ఎడిపిస్తుంది జానకి.
రాత్రి అయ్యేసరికి శోభనం పెళ్లి కూతురిలా రెడీ అయ్యి గుమ్మం దగ్గర ఎదురుచూస్తూ ఉంటుంది జానకి. అది గమనించిన మల్లిక ఈవిడ ఎంటీ ఇలా రెడీ అయ్యిందని అనుకుంటుంది. ఆ సమయంలో రామా ఇంటికి వస్తాడు. గుమ్మం దగ్గర ఉన్న జానకిని చూసి ఎందుకు బయట ఉన్నారని అడుగుతాడు. ఇక్కడి దాకా వచ్చిన వాడిని లోపలికి రానా అని అంటాడు రామా. అయితే చీరలో జానకిని చూసి ఫిదా అవుతాడు. ఆమె వైపు రొమాంటిక్ గా చూస్తూ జానకితో పాటు గదిలోకి వెళతాడు రామా.
అయితే జానకి రామా రొమాంటిక్ ముచ్చట్లను చాటుగా వింటూ ఉంటుంది ఉంటుంది మల్లిక. ఆ సమయంలో విష్ణు వచ్చి మల్లికని స్నానానికి నీళ్లు పెట్టమని అడుగుతాడు. నేను పెట్టాను ఇక్కడి నుంచి వెళ్లు అని మల్లిక కసరగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విష్ణు. అనంతరం జానకి వాళ్లని గమనిస్తూ ఉంటుంది. అంతలో ఓ చెయ్యి వచ్చి మల్లిక మీద పడుతుంది. అది విష్ణుది అనుకొని తిడుతుంది. కానీ.. చెయ్యి వేసింది జ్ఞానాంబ. ఏం చేస్తున్నావే.. నీకు అసలు బుద్ధి ఉందా? నీ భర్త అంటే నీకు విలువ, గౌరవం ఉందా? అని మల్లికని తిడుతుంది జ్ఞానాంబ. దానికి తనకి భర్త అంటే చాలా ఇష్టమని అంటుంది మల్లిక. కానీ కోపంగా మరో రెండు చివాట్లు పెడుతుంది. ఇప్పటి వరకూ చేసిన పనికిమాలిన పనులు అక్కడి నుంచి వెళ్లమని తిడుతుంది. అయితే జానకి గదిలోకి వెలుతుండడంతో అటు కాదు. ఇటు వెళ్లమని మామా గోవిందరాజులు చెప్పగా తన గదిలోకి వెళుతుంది. ఇంకేం జరుగుతుందో తర్వాతి ఎపిసోడ్ లో చూద్దాం..