మాజీమంత్రి సీనియర్ నేత జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ లో చేరారు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జూపల్లి తో పాటు కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి కుమారుడు రాజశేఖరరెడ్డి తదితరులు కాంగ్రెస్ లో చేరారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, నేతలు మల్లు రవి, సంపత్ కుమార్, పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు