రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రధాన పథకం రైతు బంధు పరిష్కారం కాదని, వ్యవసాయ రంగంలో తప్పుడు విధానాల వల్ల సమస్యలు పెరిగిపోయాయని బీజేపీ పేర్కొంది.
రైతుల సమస్యల పరిష్కారం, వారి సంక్షేమం కోసం తమ పార్టీ పథకాలను ఆగస్టు 27న ఖమ్మంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగించే ‘రైతు భరోసా’ బహిరంగ సభలో ప్రకటిస్తామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి గురువారం తెలిపారు.
‘‘తెలంగాణ రైతుల కష్టాలకు బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమన్నారు. కేసీఆర్ ప్రభుత్వం పలుమార్లు రైతులను మోసం చేసిందని, ముఖ్యంగా కౌలు రైతులను పూర్తిగా విస్మరించారన్నారు. పంటల బీమాను అమలు చేయకుండా రైతులను ఇబ్బందులకు గురిచేసిన ఈ ప్రభుత్వం ఇప్పుడు రూ.లక్ష రైతు రుణమాఫీ బకాయిలను బ్యాంకులకు చెల్లించకుండానే మాఫీ చేశామని చెప్పి మోసం చేసేందుకు ప్రయత్నిస్తోందని కిషన్రెడ్డి మండిపడ్డారు.
- Read more Political News