మన ఆయుర్వేదంలో ఎన్నో ఔషధాలు సనాతనంగా వస్తున్నాయి. ఇప్పుడంటే అల్లోపతి మెడిసన్ కి ప్రజలు భాగా అలావాటు పడ్డారు అలవాటు పడ్డారు. అయితే మన పూర్వీకుల నుంచి ఆయుర్వేద వైద్యం అని మన జీవనవిధానంలో భాగమై ఉంది. దీనిని చాలా మంది విస్మరించారు. అయితే ఇప్పటికి గ్రామీణ ప్రాంతాలలో అయితే ఆయుర్వేద వైద్యానికి ప్రాధాన్యత ఇస్తారు. అల్లోపతి మందులు వాడిన కూడా ఆయుర్వేద ఔషధాలని ఉపయోగిస్తూ ఉంటారు. ఇక ఈ మధ్యకాలంలో ఆయుర్వేద ఔషధాల ప్రాముఖ్యతని గుర్తించారు. వీటి గురించి డిజిటల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం జరుగుతూ ఉండటంతో ప్రజలు వీటివైపు మొగ్గు చూపిస్తున్నారు. వంటింట్లో వాడే ఎన్నో మసాలా పదార్దాలే ఆయుర్వేద ఔషధాలలో కూడా ఉపయోగిస్తారని తెలియడం ద్వారా వాటిని వినియోగించే విధానం మారింది. ఉదయాన్నే అల్ల, తేనే మిశ్రమాన్ని తాగడం, అలాగే బిర్యాని ఆకు రసం, జీలకర్ర, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలని ఈ మధ్య తరుచుగా ఇంట్లోనే ఆయుర్వేద ఔషధాలుగా ఉపయోగిస్తున్నారు.
వాటిలో ఉండే ఔషధ లక్షణాలు తెలుసుకోవడం ద్వారా వాటి ప్రాధాన్యత గణనీయంగా పెరిగింది. అల్లోపతి మెడిసన్ లో కూడా ఈ ఆయుర్వేద వనమూలికలు ఉపయోగిస్తున్నారు అంటూ ప్రచారం చేసుకొని ప్రజలకి తమ ఉత్పత్తులని చేరువ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే స్త్రీలు గర్భంతో ఉన్నప్పుడు, అలాగే బాలింతగా ఉన్న సమయాలలో పిప్పళ్ళ పులుసు తయారు చేసి ఇస్తారు. ఆ సమయాలలో స్త్రీలలో వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. ఈ పిప్పళ్ళ పులుసు అనేది శరీరంలో ఇమ్యూనిటీ పవర్ ని వృద్ధి చేస్తుంది. అయితే ఇది కేవలం బాలింత స్త్రీలు మాత్రమే కాకుండా ఎవరైనా తీసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్న మాట. పిప్పల్లలో ఆరు రకాల ప్రయోజనాలు ఉన్నాయి. మలబద్ధకం సమస్య ఉన్న వారు వీటి రసం తీసుకోవడం వలన చాలా త్వరగా ఉపశమనం లభిస్తుంది.
అలాగే ఇవి యాంటీ మలేరియా ఔషదంగా కూడా పనిచేస్తుంది. మలేరియాని త్వరగా తగ్గిస్తుంది. అలాగే వాతావరణంలో మార్పుల వలన వచ్చే దగ్గు, జలుబుకి సత్వర ఉపశమన పిప్పల్ల రసంతో వస్తుంది. అలాగే శరీరంలో రోగనిరోధక శక్తిని పిప్పళ్ళు పెంచుతాయి. అయితే వీటిని సరైన నిపుణుల సూచనల మేరకు మోతాదులో తీసుకోవాలి. ఎక్కువ మొత్తంలో తీసుకుంటే జీర్ణక్రియ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. లాలాగే చేతులు, కాళ్ళ వాపు, కళ్ళ మంటలు కూడా వస్తాయి. అధికమోతాదులో తీసుకుంటే విషాహారంగా మారే ప్రమాదం ఉంది. అందుకే వీటిని నిపుణుల సలహా మేరకు తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.