నిర్మల్లో బీజేపీ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ ఆనంద్, పార్టీ నాయకుడు పెండెం శ్రీనివాస్తో పాటు 300 మంది బీజేపీ కార్యకర్తలు బుధవారం మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సమక్షంలో అధికార బీఆర్ఎస్లో చేరారు. అంతకుముందు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.
బీజేపీ సీనియర్ నేత, నిర్మల్ మున్సిపల్ మాజీ చైర్మన్ అప్పాల గణేష్ ఇటీవల బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గండ్రత్ ఈశ్వర్, మరుగొండ రాము, అప్పాల గణేష్, సత్యనారాయణ, ధర్మాజీ రాజేందర్, చిలుక రమణ, సైండ్ల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.