హైదరాబాద్లోని రాష్ట్ర పార్టీ కేంద్ర కార్యాలయం గాంధీభవన్కు కామారెడ్డికి చెందిన కాంగ్రెస్ నాయకులు తరలివచ్చి పాత మండల కమిటీలనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. అలాగే యల్లారెడ్డిపేటలో సుభాష్రెడ్డి మద్దతుదారులను నియమించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కామారెడ్డి డీసీసీ అధ్యక్షుడు కైలాష్ శ్రీనివాసరావును తొలగించాలని కోరారు.
మదన్ మోహన్ మద్దతుదారులు మాట్లాడుతూ అంకితభావంతో సభ్యులు పడిన కష్టాన్ని పార్టీ గుర్తించడంలో విఫలమైందని విసుగు చెందారు. కామా రెడ్డి డీసీసీ అధ్యక్షుడు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం లేదని, ఆయన్ను పదవి నుంచి తప్పించాలని కోరారు.
నిరసనలపై టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి స్పందిస్తూ.. మార్పులు చేసే అధికారం తనకు లేదని స్పష్టం చేశారు. అందిన ఫిర్యాదులను జూలై 13న ఏఐసీసీ కార్యదర్శులకు అందజేస్తామని ఆయన పేర్కొన్నారు.
పరిస్థితిని పీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్రెడ్డి, ఏఐసీసీ ఇన్చార్జి మాణిక్రావు ఠాక్రేలకు తెలియజేస్తామని, ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకుంటామని రవి చెప్పారు..