వైసీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు రాజీనామా చేయడంతో విశాఖలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది .
వైసీపీ పార్టీ లో పరిణామాలపై విశాఖజిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అసంతృప్తితో ఉన్నారని గుస గుసలు ముందు నుండే వినిపిస్తూయి. కార్యకర్తలకు, ప్రజలకి న్యాయం చేయలేకపోయినందువల్లే ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూనాని తెలిపారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడం వాళ్ళ వేదన కలుగుతుందాని తెలిపారు.
2009ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీతో పంచకర్ల రమేశ్ బాబు రాజకీయలో చేశారు. పెందుర్తి నియోజకవర్గం నుండి పీఆర్పీ టిక్కెట్టుపై పోటీ చేసి గెలిచారు. కాంగ్రెస్లో పీఆర్పీ విలీనం అనంతరం, రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీని వీడారు. 2014 నాటి ఎన్నికల్లో ఆయన గంటా శ్రీనివాస్ రావు, అవంతి శ్రీనివాస్తో కలిసి టీడీపీలో చేరటం జరిగింది. ఆ ఎన్నికల్లో ఎలమంచిలి నుంచి గెలుపొందారు.
2020లో వైసీపీ కండువా కప్పుకున్న ఆయన చివరకు ఆ పార్టీకి కూడా ప్రస్తుతం గుడ్ బై చెప్పేసారు. దింతో జగన్ కు బిగ్ షాక్ తగిలింది. వైసీపీ పార్టీ పరిణామాలపై అసంతృప్తితో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఈ సందర్బంగా అధ్యక్షుడుగా ఎవరికైనా న్యాయం చేయలేకపోతే క్షమాపణ కోరుతున్నానని వివరించారు. వైసీపీ హైకమాండ్ ఆహ్వానం మేరకే నేను అధికార పార్టీలో చేరానని ఈ సందర్భంగా రమేష్ బాబు పేర్కొన్నారు.