శనివారం చేవెళ్లలో పార్టీ ఎస్సీ డిక్లరేషన్ను ఆవిష్కరించనున్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభకు ప్రజాప్రతినిధులు, ప్రజలు హాజరుకావాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. దళితులు, గిరిజనులపై ప్రభావం చూపిన బీఆర్ఎస్ వైఫల్యాలను ఖర్గే వివరిస్తారని విక్రమార్క చెప్పారు.
తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలకు కనీస అవసరాలు తీర్చేందుకు కాంగ్రెస్ ప్రణాళికలను ఖర్గే ప్రకటిస్తారని భట్టి మీడియాకు తెలిపారు. ఉపాధి, నిధులు, సాగునీటి సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని విక్రమార్క అన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొమ్మిదేళ్లుగా తెలంగాణను, వనరులను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు దోచుకున్నారని భట్టి ఆరోపించారు.
‘‘కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పరిగి, తాండూరు, చేవెళ్ల, వికారాబాద్కు రైతాంగానికి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీరందించేందుకు రూ.35 వేల కోట్లతో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టి బీఆర్ఎస్ కాళేశ్వరంగా రీడిజైన్ చేసి లక్షల కోట్ల రూపాయలను దోచుకుంది. అని సీఎల్పీ నేత ఆరోపించారు.
అర్హులైన వారికి ఇళ్లు, భూమి మంజూరు చేసింది కాంగ్రెస్సేనని విక్రమార్క అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం దళితులు, గిరిజనుల నుంచి 22 లక్షల ఎకరాల అసైన్డ్ భూమిని వెనక్కి తీసుకుని కార్పొరేట్ కంపెనీలకు విక్రయించిందని ఆరోపించారు.
- Read more Political News