ఏపీలో ఇళ్ల నిర్మాణాలపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి శుక్రవారం డిమాండ్ చేశారు.
భాజపా ఏపీ శాఖ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆమె.. ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వం 1.57 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు ఇచ్చిందని స్పష్టం చేశారు. అయితే, రెండు రోజుల క్రితం, 21,000 ఇళ్లను మాత్రమే నిర్మిస్తున్నారని ఏపీ మంత్రి ఒకరు చెప్పారు.
ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ రాష్ట్రానికి కేంద్రం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తోందని, అయితే వైఎస్సార్సీపీ మాత్రం కేంద్ర ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తోందన్నారు.