వాయువ్య బంగాళాఖాతంలో ఉన్నఆవర్తనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు దంచి కొట్టాయి. వరుణ ప్రతాపంతో రాష్ట్ర రాజధాని అతలాకుతలమైంది.
తెలంగాణాలో రానున్న మూడు రోజుల పటు భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. వచ్చే మూడు రోజులు కుండపోత వానలు పడనున్నట్టుగా తెలిపింది. దింతో తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ చేసారు. ఈ నెల 25, 26, 27 తేదీల్లో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు పడవచ్చని అధికారులు ప్రకటించారు.
మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలలో రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిచే అవకాశం ఉన్నట్టుగా అధికారులు చెబుతున్నారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో కాకినాడ జిల్లాలో వానలు దంచి కొడుతున్నాయి. ఇదే నేపథ్యం లో హైదరాబాద్ లో బారి వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో రెడ్ అలెర్ట్ జారీ చేసారు. రాష్టం లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావర్షశాఖ అధికారులు హెచ్చరించారు.
జోరుగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ తడిసి ముద్ద కాగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల భవనాలు కృంగిపోయాయి. ఉరుములు మెరుపులతో కూడిన భారీ శబ్దంతో పడిన పిడుగులతో భాగ్యనగరం వాసులు బెంబేలెత్తిపోయారు. ఒక్కసారిగా కురిసిన వర్షానికి తీవ్ర అవస్థలు పడ్డారు.
ఒక్కసారిగా విరుచుకుపడిన వానతో లోతట్టు ప్రాంతాలు జైలమయం కాగా లోతట్టు ప్రాంతాల్లోకి వరద ముంచెత్తింది. కోటి, సుల్తాన్ బజార్, బేగంబజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్ బాగ్, నారాయణగూడ, హిమాయత్ నగర్, లిబర్టీ, లక్డికాపూల్ లో కురిసిన భారీ వర్షానికి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎల్బీనగర్, మనసురాబాద్, నాగోల్, వనస్థలిపురం, వి యన్ రెడ్డి నగర్, హయత్ నగర్, భాగ్యలత నగర్, పెద్ద అంబర్పేట్ మెట్ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో భారీగా వర్షాలు పడటంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. మోకాళ్ళ లోతు నీరు చేరాయి. బోరబండ, ఎర్రగడ్డ, సనాతనగర్, యూసఫ్ గూడా, అమీర్పేట్, ఎస్ ఆర్ నగర్ మైత్రివనం, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో కూడా కురిసిన వర్షానికి ప్రజలు నానా అవస్థలు పడ్డారు. ముసారం బాగ్ వంతెన పై భారీగా వర్షపు నీరు నిలవడంతో అంబర్పేట్ నుంచి దిల్సుఖ్నగర్ కు వెళ్లే వాహనదారులు ఇక్కట్లు ఎదురుకున్నారు.
ఎడతెరపు లేకుండా వానలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, బాల్దియ కమిషనర్ రోనాల్డ్ రోజ్ ప్రకటించారు. సహాయానికి జిహెచ్ఎంసి కంట్రోల్ రూమ్ నంబర్లు 0402111111, 9000113667 లో సంప్రదించాలని సూచించారు.