పాలమూరు ప్రాంతంలో మొత్తం 14 స్థానాలు దక్కించుకోవడానికి కృషి చేయాలని టీపీసీసీ చీఫ్ ఎ. రేవంత్రెడ్డి మంగళవారం కాంగ్రెస్ శ్రేణులకు, కొత్తగా చేరిన వారికి ఉద్బోధించారు. ఆ జిల్లాకు న్యాయం చేయాలంటే కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యమని అయన అన్నారు.
గద్వాల నుంచి బీఆర్ఎస్, బీజేపీ నుంచి పార్టీలో చేరిన కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ‘పార్టీ పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ ప్రాధాన్యతా ప్రాతిపదికన, యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేస్తామన్నారు.
జూరాల, నెట్టంపాడు, కోయిల్సాగర్, శ్రీశైలం, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను నిర్మించింది కాంగ్రెస్ పార్టీయే.
తెలంగాణకు రాష్ట్రం వచ్చినా జిల్లా ప్రజల కష్టాలు తీర్చలేదన్నారు.
‘‘చేవెళ్లలో చేసిన ఎస్సీ/ఎస్టీ డిక్లరేషన్ దళితులు, గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపుతుంది. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, ఎయిడ్స్ బాధితులు, ఫైలేరియా, డయాలసిస్ రోగులకు 4 వేల పింఛన్ను అధికారంలోకి రాగానే అందజేస్తాం’’ అని రేవంత్రెడ్డి తెలిపారు.
- Read more Political News