వరద బాధితులకు అండగా నిలిచి సీతక్క గ్రేట్ అనిపించుకున్నారు. తాను అండగా ఉంటానంటూ బాధితులకు భరోసా కల్పిస్తున్నారు. తాజాగా కురిసిన భారీ వర్షాలకు ములుగు జిల్లాలో కొన్ని ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. చెరువులు పొంగిపోవడంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి.
ఇక నివాస స్థలంలోకి నీళ్లు చేరుకోవడంతో అనేకమంది ప్రజలు నిరాశ్రయులుగా మారారు. వీరిని ఆదుకునేందుకు సీతక్క ముందుకొచ్చారు. వరద బాధితులకు రూ.20 లక్షల విలువైన నిత్యావసర సరుకులు, దుప్పట్లు పంపిణీ చేసి సీతక్క మరోసారి గొప్ప మనస్సును చాటుకున్నారు. రూ. 20 లక్షల విలువైన నిత్యావసర సరుకులలు, దుప్పట్లు వంటి వాటిని స్వయంగా తీసుకెళ్లి పంపిణీ చేశారు. పడవలోనే పెద్ద బస్తాలలో సరుకులు ఉంచి గ్రామానికి తరలించారు. అనంతనం వాటిని గ్రామస్తులకు పంపిణీ చేశారు.
జంపప్న వాగు ఉధృతితో కొండాయి గ్రామాన్ని వరద చుట్టుముట్టింది. దీంతో గ్రామం మొత్తం నీట మునిగింది. అంతేకాకుండా జంపన్న వాగులో పడి పలువురు మరణించగా.. మరికొందరు గల్లంతయ్యారు. దీంతో గల్లంతైన వారిని గుర్తించాలని, తక్షణమే ప్రత్యేక హెలికాప్టర్ పంపించాలని ఇటీవల సితక్క మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకోవడం అందరినీ కలిచివేసింది. భారీ వర్షంలోనూ వరద బాధితులను పరామర్శిస్తూ సితక్క ధైర్యం చెబుతున్నారు. ప్రభుత్వం తరపు నుంచే కాకుండా తన వంతు కూడా సహాయం అందిస్తున్నారు