దళితుల సమస్యలపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు లేదని, ఆమె తండ్రి, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ద్రోహం చేశారని టీపీసీసీ పీఏసీ కన్వీనర్ మహ్మద్ షబ్బీర్ అలీ అన్నారు.
కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్పై కామారెడ్డిలో కవిత చేసిన ఆరోపణలపై అలీ స్పందిస్తూ… ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలకు ఇచ్చిన విఫలమైన వాగ్దానాలపై ఆమె తండ్రిని ప్రశ్నించాలని కవితను షబ్బీర్ అలీ కోరారు. ‘‘దళిత సీఎం చేస్తానని చెప్పి ఎస్సీలను తన తండ్రి కేసీఆర్ మోసం చేశారని కవిత ఒప్పుకుంటుందా? నిరుపేద దళిత, గిరిజన కుటుంబాలకు 3 ఎకరాల భూమి ఇస్తామన్న హామీ ఏమైంది? అని షబ్బీర్ అడిగారు.
గత కాంగ్రెస్ హయాంలో దామోదర రాజనర్సింహ దళితుడు ఉప ముఖ్యమంత్రి ఉండేవన్నారు. దళిత డిప్యూటీ సీఎం డాక్టర్ టి.రాజయ్యను చంద్రశేఖరరావు తొలగించారని ఆయన ఎత్తిచూపారు. ఈసారి రాజయ్యకు టిక్కెట్టు కూడా ఇవ్వలేదన్నారు.
- Read more Political News