వర్షాకాల సమావేశాల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. మరో నాలుగు నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు, ఆగస్టులోనే అసెంబ్లీ సమావేశాలు, ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే నెల రెండోవారంలో అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశముంది.
అటు సంక్షేమ, అభివృద్ది పథకాల వల్ల ప్రజలకు జరిగిన లబ్ధి గురించి చర్చించనున్నారు. ఇప్పటికే ప్రజలను ఆకట్టుకునేందుకు కేసీఆర్ సర్కార్ అనేక కొత్త అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను షురూ చేసింది. ఇప్పటికే పొడు భూములను పట్టాలు ఇచ్చే కార్యక్రమం కొనసాగుతోంది. ఒకవైపు సంక్షేమ పథకాలతో పాటు మరోవైపు అభివృద్ది పనులను కేసీఆర్ సర్కార్ వేగవంతం చేసింది.