వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం కేసీఆ ర్ఈ నెల 31న కేబినెట్ భేటీ నిర్వహించాలని నిర్ణయించారు. కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న ఈ కీలక భేటీలో పలు అంశాలపై చర్చించే అవకాశముంది. ప్రస్తుతం రాష్ట్రంలో కురుస్తున్న అసాధారణ వర్షాలు, పంట నష్టం, సహాయకచర్యలు, ఇతర అంశాలపై చర్చించనున్నారు. చాలా రోజుల తర్వాత తెలంగాణ కేబినెట్ భేటీ జరుగుతోంది. దీంతో ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.ఎన్నికల వేళ తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలకు ఈ బేటీ లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశమున్నట్టు తెలుస్తోంది.
ఇక భారీ వర్షాలు, వరదలతో జనజీవనం అస్తవ్యస్తంగా తయారైంది. చెరువులు, వాగుల్లోకి వరద నీరు చేరుకుని ఉగ్రరూపం దాల్చుతున్నాయి. ఈ ధాటికి పలు గ్రామాలు నీటిలో మునిగిపోయాయి. ఇక పలుచోట్ల వరద ప్రవాహనికి నీటిలో గల్లంతు అయి ప్రాణాలు కోల్పోతున్నారు.వరద బాధితులకు ఆర్ధిక సాయం ప్రకటించాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. బాధితులకు రూ.10 వేల సాయం ప్రకటించాలని కోరుతున్నారు. ఇప్పటికే వర్షాలపై గత వారం రోజులుగా ఉన్నతాధికారులతో కేసీఆర్ మాట్లాడుతున్నారు. సీఎస్ శాంతికుమారి ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు. వరద బాధితులకు సహాయకచర్యలు, పునరావాసం కల్పించే విధానాల వివరాలు తెలుసుకునే ప్రయత్నం ఎప్పటికప్పుడు చేస్తున్నారు. ప్రాణనష్టం జారకుండా చూడాలని, అధికారులు లకు ఆదేశించారు. అలాగే సహాయకచర్యల కోసం హెలికాప్టర్లను పంపించాలని ఆదేశించారు.