సచివాలయంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన జరిగిన తెలంగాణ మంత్రివర్గ సమావేశం నిన్న ముగిసింది.
దాదాపు ఐదు గంటలకు పైగా జరిగిన ఈ సమావేశంలో వర్షాలకు సంబంధించిన అంశాలపైనే చర్చించినట్లు సమాచారం. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు, ఇటీవల వరదల పరిస్థితి తదితర అంశాలపై సమావేశంలో చర్చించినట్లు సమాచారం.
వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. వరదల వల్ల జరిగిన పంటల నష్టాన్ని కూడా కేబినెట్ అంచనా వేసింది.
ఆగస్టు 3 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న పలు బిల్లులపై కూడా తెలంగాణ కేబినెట్ చర్చించింది.