విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులకు అండగా నిలిచేందుకు యువజన కాంగ్రెస్ జులై 5 నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టింది. యువతకు ఉద్యోగాలు కల్పించడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని యూత్ కాంగ్రెస్ ఓ ప్రకటనలో నిందించింది.
వైసిపి రాష్ట్ర ఇన్ ఛార్జి సురభి ద్వివేది, రాష్ట్ర అధ్యక్షులు కె.శివసేనారెడ్డి సమక్షంలో టిపిసిసి అధ్యక్షుడు యాత్ర పోస్టర్ను విడుదల చేశారు. విద్యార్థుల పట్ల కేసీఆర్ ప్రభుత్వ ఉదాసీనతను బట్టబయలు చేస్తాం.. సీఎం నియోజకవర్గమైన గజ్వేల్ నుంచి ప్రచారం ప్రారంభిస్తాం’’ అని శివసేనారెడ్డి తెలిపారు.