కొత్తగూడెం బీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్రావు ఎన్నికను తెలంగాణ హైకోర్టు చెల్లుబాటు చేయకుండా, ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా ప్రకటించింది. ఎన్నికల అఫిడవిట్లో వనమా వెంకటేశ్వరరావు తప్పుడు సమాచారం అందించారని ఆరోపిస్తూ జలగం వెంకట్రావు 2018లో హైకోర్టును ఆశ్రయించిన పిటీషన్ ఆధారంగా హైకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది. 2018 ఎన్నికల్లో సమీప అభ్యర్థి జలగం వెంకటరావును ఎమ్మెల్యేగా హైకోర్టు ప్రకటించింది. ఎన్నిక చెల్లదని ప్రకటించడంతో పాటు తప్పుడు అఫిడవిట్ సమర్పించినందుకు గాను వనమా వెంకటేశ్వర్ రావుకు హైకోర్టు రూ.5 లక్షల జరిమానా విధించింది.
ఎన్నికల అనంతరం వనమా వెంకటేశ్వరరావు కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్లో చేరారు.