హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, కేంద్ర పాలిత ప్రాంతాలు యూనియన్ టెరిటరీ(యూటీ) గా మారే రోజులు ఎంతో దూరంలో లేవని, అన్ని ప్రాంతీయ పార్టీలను హెచ్చరిస్తున్నాయని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు.
ఢిల్లీ బిల్లుపై లోక్సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ…. రాజ్యాంగ విరుద్ధమైన ఈ బిల్లును ఎంఐఎం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తెలిపారు. ఢిల్లీకి సంపూర్ణ రాష్ట్ర హోదా కోసం అటల్ బీహారి వాజపేయీ ఈ సభలో బిల్లును ప్రవేశపెట్టారని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుత బిల్లు ద్వారా గౌరవ సభ హోదాను ఈ ప్రభుత్వం కించపరుస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మీ రాజకీయ పోరాటాన్ని సభ వెలుపల చూసుకోవాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా కేంద్ర ప్రభుత్వంలోని పెద్దల నుంచే బయటకి వచ్చారని అన్నారు. అయన కేంద్ర ప్రభుత్వ మనిషేనని, మీరు అధికారంలో లేనప్పుడు ఆయనను ఆ స్థానంలో నియమించాలని అనుకుంటున్నారని కేంద్రంపై ఓవైసీ విమర్శలు గుర్తించారు