చాలా రోజుల తర్వాత కమలంలో ఊహించని చేరికలు కొనసాగుతున్నాయి. బిజేపి పార్టీలోకి కీలక నేతలు చేరుతున్నారు. ఈ మధ్య కాలంలనే కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కొందరు బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఇక రానున్న రోజుల్లో మరిన్ని చేరికలు ఉంటాయని తెలుస్తుంది.
అయితే ఈ చేరికలని బిఆర్ఎస్, కాంగ్రెస్లు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఎందుకంటే బిఆర్ఎస్ లో నేతలు ఫుల్ గా ఉన్నారు . ఇంకా చెప్పాలి అంటే ఓవర్ ఫ్లో అయింది. అందులో కొందరు నేతలు బయటకి వెళ్లిన బిఆర్ఎస్ కి నష్టం కూడా ఎం లేదనే చెప్పాలి. ఇటు కాంగ్రెస్ లోకి కీలక నేతలు వస్తున్నారు. ఇక ప్రజా బలం లేని నేతలు వెళ్లిపోతే నష్టమేమీ లేదన్నట్లు పార్టీలు కూడా పట్టనట్టు ఉంటున్నాయి.
అయితే బీజేపీ మరింత దూకుడుగా ముందుకెళ్లడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. బలమైన నేతలని చేర్చుకోవడానికి స్కెచ్ వేస్తుంది. ఈ క్రమంలోనే ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలకు చెందిన ఇద్దరు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలని బీజేపీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలిసింది. అది కూడా బిఆర్ఎస్ లో సీటు దక్కని వారినే టార్గెట్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే వారితో టచ్ లో ఉన్నట్లు తెలిసింది.
అలాగే కాంగ్రెస్ లో బలంగా ఉన్న మాజీ ఎమ్మెల్యేలని సైతం బీజేపీ లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారట. ఇప్పటికే కొందరు నేతలు బీజేపీలోకి రావడానికి సిద్ధమైనట్లు తెలిసింది. అయితే చేరికలు మరింత పెరిగితే బిజేపికి బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే చాలా సీట్లలో బిజేపికి బలం లేదు. ఈ క్రమంలోనే ఇతర పార్టీల నుండి ప్రజా బలం ఉన్న బలమైన నాయకులు వస్తేనే బిజేపికి బలం పెరుగుతుంది.
Read More Political News