ఈ మధ్యకాలంలో సెలబ్రెటీలని వేధిస్తున్న అరుదైన వ్యాధులు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. స్టార్ హీరోయిన్ సమంత మాయోసైటిస్ అనే అరుదైన ఆటో ఇమ్యునో డిసీజ్ తో ట్రీట్మెంట్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. గతంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే కూడా అరుదైన మెంటల్ డిసీజ్ తో కొంత కాలం ఇబ్బంది పడింది. ఆ డిసీజ్ ఉన్న సమయంలో పదే పది ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వచ్చేవని, ఒంటరితనంగా అనిపించేది అని, తీవ్రమైన భయం, ఆత్మన్యూనత శరీరం, మనసు నిండా ఆవహించి ఉండేదని చెప్పింది.
దాని నుంచి ట్రీట్మెంట్ తీసుకొని బయటపడింది. ఇక సమంత చాలా రోజుల నుంచి ఈ మాయోసైటిస్ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటుంది. అలాగే దర్శకుడు అనుదీప్ కూడా తాను సెన్సస్ కి అంబందించిన వ్యాధితో బాధపడుతున్నానని చెప్పాడు. ఈ సమస్య కారణంగా కాఫీ తాగలేను. తీవ్రమైన కాంతిని చూడలేను. చూస్తే ఒక్కసారి నీరసం వచ్చేస్తుంది. ఈ వ్యాధి కారణంగా రోజుకి ఒక పూట మాత్రమే వండిన ఫుడ్ తినగలుగుతున్న అని చెప్పాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తనకున్న అరుదైన వ్యాధి గురించి బయట పెట్టాడు.
గత కొంత కాలంగా వెస్టిబ్యులర్ హైపోఫంక్షన్ అనే వ్యాధితో పోరాడుతున్నట్లు వెల్లడించాడు. ఈ వ్యాధి వల్ల బ్యాలెన్స్ కోల్పోతున్నట్లు తెలిపాడు. ఇది చెవులకి సంబందించిన సమస్య అని చెప్పాడు. ఈ డిసీజ్ కారణంగా చెవిలో వినికిడి సమస్య తగ్గిపోతుందని, ఈ కారణంగా ఎవరైనా మాట్లాడినపుడు వేగంగా రెస్పాండ్ కాలేమని, అలాగే శరీరం కూడా ఒక్కోసారి బ్యాలెన్స్ కోల్పోతుందని చెప్పాడు. దీనికి సంబంధించి వరుణ్ ధావన్ ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నట్లు సమాచారం. వరుణ్ ధావన్ తన డిసీజ్ గురించి చెప్పడంతో ఈ న్యూస్ బిటౌన్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది.