మణిపూర్లో కొనసాగుతున్న హింసాకాండ ఒక్కసారి రాష్ట్రమంతటా వ్యాపించినా అదుపు చేయడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విఫలమైందని టీపీసీసీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు ఆదివారం ఆరోపించారు.
ఖమ్మంలో ‘భరోసా’ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన నిరసన ర్యాలీలో హనుమంతరావు మాట్లాడుతూ…. మణీపూర్ లో ఎంతో మంది యువకులు, మహిళలు హత్యకు గురయ్యారని హనుమంతరావు అన్నారు. శాంతిభద్రతలు దెబ్బతిన్నప్పటికీ, హింసను నిరోధించేందుకు చర్యలు తీసుకోవడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.
“బాధితులు మరియు వారి కుటుంబ సభ్యులకు మా సంఘీభావం తెలియజేస్తున్నాము, మణీపూర్ లో సాధారణ పరిస్థితులు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం కోరుతున్నాము. మణీపూర్ లో హింసను అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి” అని హనుమతరావు అన్నారు.