కొత్తగా ఏర్పాటైన ప్రతిపక్ష కూటమి I.N.D.I.A పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం ని ప్రవేశపెట్టిన తర్వాత, ఆ తీర్మానాన్ని తాము వ్యతిరేకిస్తామని వైఎస్సార్సీపీ ప్రకటించింది.
కొత్తగా ఏర్పాటైన ప్రతిపక్ష కూటమి I.N.D.I.Aలో భాగంగా కాంగ్రెస్ పార్టీ లోక్సభలో మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ కూడా ప్రభుత్వంపై అవిశ్వాసతీర్మానం పెట్టింది.
అయితే ఈ తీర్మానాన్ని వైఎస్సార్సీపీ వ్యతిరేకిస్తుందని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. అంతా సవ్యంగా సాగుతున్నప్పుడు దీని అవసరం ఎక్కడిది.. ఆ తీర్మానాన్ని వ్యతిరేకిస్తాం’’ అని అన్నారు.
మణిపూర్లో జరిగిన జాతి వివాదంపై పార్లమెంటులో ప్రధాని స్పందించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి, ఇక్కడ మహిళలపై ఘోరమైన నేరం వెలుగులోకి వచ్చింది, ఇంటర్నెట్లో వీడియో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా ప్రజల నుండి భారీ ఖండన వచ్చింది.