ఏపీ రాజకీయాలలో ప్రధాన పార్టీలైన మూడు కూడా ఇప్పటి నుంచే ప్రజలలోకి వెళ్లి ఎన్నికల వేడిని రాజేస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు జిల్లాల పర్యటనలు చేస్తూ విస్తృతంగా మినీ మహానాడులు నిర్వహిస్తూ వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకుని సొంతం చేసుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అయితే చంద్రబాబుపై ఒకప్పటిలా ప్రజలలో ఉన్న ఇమేజ్ ప్రస్తుతం లేదనే టాక్ వినిపిస్తుంది. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా విస్తృతంగా ప్రజలలోకి వచ్చి తనపై ప్రజలలో నమ్మకాన్నిపెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే ఎన్నికలలో కచ్చితంగా బలమైన సీట్లు సొంతం చేసుకొని ప్రభుత్వం ఏర్పాటు చేయడం కానీ లేదంటే కీ రోల్ పోషించడం కానీ చేయాలని భావిస్తుంది. ఇక అధికార వైసీపీ అయితే సంక్షేమ పథకాలతోనే ప్రజలలోకి వెళ్లాలని అనుకుంటుంది.
తాము చేపడుతున్న సంక్షేమమే ఈ సారి మళ్ళీ తమని అధికారంలోకి తీసుకొస్తుంది అని ముఖ్యమంత్రి జగన్ బలంగా నమ్ముతున్నారు. ప్రజా వ్యతిరేకత అనేది కేవలం ప్రతిపక్షాలు సృష్టించిన ఒక కల్పన మాత్రమే అనే భావిస్తున్నాయి. అయితే జనసేన, టీడీపీ జత కడితే కచ్చితంగా గెలుపు కష్టం అవుతుందని భావించిన జగన్ టీమ్ ఆ రెండు పార్టీలు కలవకుండా చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా పవన్ కళ్యాణ్ ని రెచ్చగొడుతున్నాయి. ఇదిలా ఉంటే మరో వైపు రీసెంట్ గా జరిగిన ప్లీనరీతోనే జగన్ ఎన్నికల శంఖం పూరించారు. విస్తృతంగా ప్రజలలోకి ఎమ్మెల్యేలు వెళ్లాలని నేరుగానే సాంకేతాలు ఇచ్చేసారు. ప్రజలలోకి వెళ్ళి గెలిచే అవకాశాలు ఉన్నవారికే సీట్లు వస్తాయని కూడా తెగేసి చెప్పేసారు.
ఇక జగన్ కూడా నవంబర్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రతో ప్రజలలోకి వెళ్లాలని అనుకుంటున్నట్లు టాక్ వినిపిస్తుంది. ముందస్తు ఎన్నికలకి వెళితే ఇప్పటి నుంచే ప్రజలలోకి ఉండాలని క్యాడర్ కి సాంకేతాలు ఇస్తున్నారు. ఈ నేపధ్యంలో క్రింది స్థాయికార్యకర్తలని ప్లీనరీ వేధికంగా అందరూ నాయకులు ఉత్సాహపరిచే ప్రయత్నం చేసారు. ఇక త్వరలో విశాఖ నుంచి పరిపాలన మొదలుపెట్టి మూడు రాజధానుల అంశంతో అజెండాతో ఎన్నికలకి వెళ్లాలని జగన్ భావిస్తున్నట్లు రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట. మరి ఈ వ్యూహాత్మక ఎత్తుగడలు జగన్ కి మళ్ళీ గెలుపు అవకాశాలు ఎంత వరకు తీసుకొస్తాయి అనేది వేచి చూడాలి.