మరికొన్ని నెలల్లో తెలంగాణలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో అప్పుడే ఎన్నికల వాతావరణం మెుదలైంది. పార్టీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు.
తాజాగా.. YSRTP అధ్యక్షురాలు వైస్ షర్మిల బీఆర్ఎస్, బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆ రెండు పార్టీలు కూడా వేర్వేరు కాదని.. రెండు పార్టీలు ఒకటేనని అన్నారు. రెండు పార్టీలు కలిసి ‘బీజేపీ రాష్ట్ర సమితి’ రాజకీయాన్ని నడుపుతున్నాయని మండిపడ్డారు .
అందుకే కేసీఆర్ అవినీతి చేశారని తెలిసినా.. కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదన్నారు. ఢిల్లీ దాకా కేసీఆర్ అవినీతి పాకిందని చెబుతున్న బీజేపీకి.. కేంద్రంలో అధికారం పెట్టుకొని చర్యలకు చేతులు రావెందుకో ! అవినీతి కేసీఆర్ను అరెస్ట్ చేయడానికి మనసు రాదేందుకో ! నువ్వు కొట్టినట్లు చెయ్యి, నేను పడ్డట్లు ఏడుస్తా.. ఇదే ఇద్దరి మద్య రహస్య ఒప్పందం. మోడీ గారు.. కేసీఅర్ అవినీతిపై మీ దగ్గర ఇంత సమాచారం ఉంటే… ఇన్నాళ్లు ఎందుకు విచారణ జరిపించలేదు? అని షర్మిల విమర్శించారు.