నాచురల్ స్టార్ గా పేరు సంపాదించుకున్న సాయి పల్లవి టాలీవుడ్ లోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలో కూడా మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది, గ్లామర్ పాత్రలకి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా కేవలం నటన ప్రాధాన్యత ఉన్న సినిమాలకి మాత్రమే ఓకే చెబుతుంది.నటన పరంగానే కాకుండా సాయి పల్లవి కి ఆమె వ్యక్తిత్వానికి చాలామంది అభిమానులు ఉన్నారు కేవలం నేటిజెన్లు ప్రేక్షకులే కాకుండా సెలబ్రిటీలు సైతం ఆమెని ఇష్టపడతారు.
![ఇప్పుడు మనస్సు చాలా ప్రశాంతంగా ఉంది.. కాశ్మీర్ లో సాయి పల్లవి 2 ఇప్పుడు మనస్సు చాలా ప్రశాంతంగా ఉంది.. కాశ్మీర్ లో సాయి పల్లవి](https://rtvmedia.in/wp-content/uploads/2023/07/SA-02.jpg)
ప్రస్తుతం సాయి పల్లవి ఎలాంటి సినిమాలకి సైన్ చేయలేదు ఆమె చివరిగా నటించిన మూవీ గార్గి. ప్రస్తుతం ఆమె కాశ్మీర్లో విహరిస్తోంది కారణం ఏంటో తెలుసా? సాయి పల్లవి తాజాగా శివ కార్తికేయన్ హీరోగ నటిస్తున్న సినిమాలోఆమె హీరోయిన్గా నటించబోతోంది. ఈసినిమా SK21 వర్కింగ్ టైటిల్తో రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా షూటింగ్ మేరకే సాయి పల్లవి కాశ్మీర్లో ఉన్నట్టు తెలుస్తోంది అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలని తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.
లోకనాయకుడు కమల్హాసన్ ,ఆర్.మహేంద్రన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఆ సినిమాను సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ సంస్థ సమర్పిస్తోంది.రెహమాన్ మేనల్లుడు యంగ్ స్టార్ జి.వి ప్రకాష్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలో విశ్వరూమ్ ఫేం రాహుల్ బోస్ విలన్గా నటిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కశ్మీర్ లో జరుగుతోంది