సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ చెప్పారు నా కుటుంబమంతా జనసేన అధినేత పవన్ కల్యాణ్తోనే ఉంటారని అన్నారు బ్రో సినిమాలో ఓ సీన్ వివాదం అవ్వడం గురించి మాట్లాడుతూ.. మంత్రి అంబటి రాంబాబుపై జోకులు వేసే ఉద్దేశంతో ఆ సీన్ తీయలేదని చెప్పారు. సినిమా, రాజకీయాలను వేర్వేరుగా చూడాలని అన్నారు. తనకు రాజకీయ పైన అనుభవం లేదని.. కానీ పాలిటిక్స్లో మాత్రం నా ఫ్యామిలీ అంతా పవన్ వెంటే ఉంటుందని తెలిపారు.
![మా ఫ్యామిలీ అంతా పవన్ వెంటే..పాలిటిక్స్ పై సాయిధరమ్ తేజ్ వ్యాఖ్యలు..! 2 మా ఫ్యామిలీ అంతా పవన్ వెంటే..పాలిటిక్స్ పై సాయిధరమ్ తేజ్ వ్యాఖ్యలు..!](https://rtvmedia.in/wp-content/uploads/2023/08/Untitled-design-2023-08-02T104634.337.jpg)
బ్రో’ చిత్రంలో నా క్యారెక్టర్ చనిపోయినప్పుడు భ్రమతో మూడు గంటలు ఏడ్చా.. పవన్ మామయ్యకు దూరమై పోతున్నాననే బాధతో. కానీ మేమంతా పవన్ కల్యాణ్తోనే జీవితాంతం ఉంటాం.’ అని సాయిధరమ్ తేజ్ అన్నారు. బ్రో సినిమా కథ వినగానే ఎప్పుడెప్పుడా అని ఆత్రుతగా ఎదురు చూశానని, చిరంజీవి మామయ్యతో నటించేందుకు వేయికళ్లతో ఎదురుచూస్తున్నానని చెప్పారు . మల్టీస్టార్ సినిమాల్లో నటించడానికి తానెప్పుడూ సిద్ధమేనన్నారు. పవన్, సాయితేజ్ నటించిన ‘బ్రో’ సినిమా విజయోత్సవం లో భాగంగా చిత్రబృందం మంగళవారం శ్రీనగర్ కాలనీలోని ఓ హోటల్లో మీడియాతో మాట్లాడింది.