ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ పుష్ప : ది రైజ్. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మాణం జరుపుకున్న ఈ పాన్ ఇండియా మూవీకి దేశవ్యాప్తంగానే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగానూ మంచి వసూళ్లు వచ్చాయి. వరల్డ్ వైడ్ గా దాదాపు రూ. 330 కోట్లకు పైగా వసూళ్లను సాధించి .. ట్రేడ్ వర్గాల వారిని ఆశ్చర్యనికి గురిచేసింది. అలాగే… ఇందులోని బన్నీ పాత్రను చాలా మంది సెలబ్రిటీస్ ఇమిటేట్ చేస్తూ సినిమాపై తమ అభిమానాన్ని చెపుతున్నారు. దీంతో అల్లు అర్జున్ పెర్ఫెక్ట్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ముఖ్యంగా ఈ మూవీకి బాలీవుడ్ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అక్కడ ఏకంగా రూ. 100కోట్లకు పైగానే వసూళ్ళు వచ్చాయి. ఈ మధ్యకాలంలో బాలీవుడ్ లో ఈ తరహా పక్కా మాస్ పాత్రతో ఏ హీరో కూడా సినిమా చేయకపోవడంతో నార్త్ జనానికి పుష్ప మ్యానియా ఓ రేంజ్ లో అంటుకుంది. ఈ క్రమంలో పుష్ప 2 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక పుష్ప సినిమా లో మరో ప్రత్యేకత ఏంటంటే.. ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసినప్పటికీ.. బాలీవుడ్ థియేటర్స్ లో ఇంకా ప్ట్రాంగ్ రన్ ను కొనసాగించడం విశేషమని చెప్పాలి. పుష్ప గా బన్నీ మేకోవర్, లాంగ్వేజ్ , బాడీ లాంగ్వేజ్ మాస్ జనానికి విపరీతంగా నచ్చేయడం వల్లనే ఈ స్థాయిలో సినిమా ఇంకా తన హవా కొనసాగిస్తోందని చెప్పచ్చు. పదవ వారంలోకి అడుగుపెట్టినా సరే బాలీవుడ్ లో ఈ మూవీ రూ. 1కోటి నెట్ వసూళ్ళను రాబట్టినట్టు తెలుస్తుంది. రష్మికా అందాల అభినయం, దేవీశ్రీ క్యాచీ ట్యూన్స్ ప్రేక్షకులకు ఎంతగానో ఆకట్టుకున్నాయి. వాటికి తగ్గ స్థాయిలోనే సుక్కూ తన దర్శకత్వ ప్రతిభను చూపించాడు. ఈ లెక్కన 2వ భాగం వచ్చేవరకూ కూడా బాలీవుడ్ లో పుష్ప తన హవా కొనసాగిస్తుందేమో మరి చూడాలి.