మజ్ను సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగుపెట్టిన అందాల భామ అను ఇమ్మాన్యుయేల్. ఈ అమ్మడు మొదటి సినిమాతో సూపర్ హిట్ కొట్టి తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుస సినిమాలలో ఛాన్స్ కొట్టేసింది. ఏకంగా అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ సరసన కూడా నటించేసింది. ఈ అమ్మడు తన హాట్ లుక్స్ తో దర్శకులని, హీరోలని కూడా తనవైపుకి తిప్పుకొని ఛాన్స్ లు పట్టేసింది. అయితే అదృష్టం కలిసిరాకపోవడంతో ఆమె నటించిన సినిమాలు ఫ్లాప్ అవుతూ వచ్చాయి. గ్లామర్, ఇంటిమేట్ సన్నివేశాలు చేయడానికి అను ఇమ్మాన్యుయేల్ ఏ మాత్రం మొహమాట పడదు. ఈ కారణంగానే ఫ్లాప్స్ ఉన్న కూడా ఈమెకి అవకాశాలు బాగానే వస్తున్నాయి.
ప్రస్తుతం ఈ బ్యూటీ అల్లు శిరీష్ తో కలిసి నటించిన ఊర్వశివో రాక్షసీవో సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి ఆమె సీరియస్ అయ్యింది. అల్లు ఫ్యామిలీలో అన్నదమ్ములు ఇద్దరితో కలిసి నటించారు కదా వీరిలో ఎవరు క్యూట్, ఎవరు నాటీ అనే ప్రశ్న జర్నలిస్ట్ అడిగారు. అయితే ప్రశ్న అనుకి కాస్తా ఇబ్బందికరంగా అనిపించింది. ఆమెకి మరో రకంగా అర్ధం కావడంతో ఆ విలేకరిపై వెంటనే సీరియస్ అయిపొయింది.
అడగడానికి మరే ప్రశ్నలు లేవా? కాస్తా మంచి ప్రశ్నలు అడగండి అని ఘాటుగా బదులిచ్చింది. దీంతో రిపోర్టర్ తేరుకొని ప్రశ్నలు సినిమా మీదకి మార్చేశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రీసెంట్ గా శాకినీ డానికి సినిమా ప్రమోషన్ లో కూడా రెజీనా ఇలాగే ఓ ప్రశ్నకి రిపోర్టర్ మీద సీరియస్ అయ్యింది. ఎంత సెలబ్రెటీలు అయినా కూడా వారు కూడా అమ్మాయిలే కదా ప్రశ్నలు వేసే సమయంలో కాస్తా పద్ధతిగా సినిమాకి సంబంధించి అడగాలనే ఆలోచన ఉండాలి కదా అంటూ అను వీడియోపై నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.