AP Capital: ఏపీలో రాజధాని చుట్టూ అన్ని పార్టీలు రాజకీయం చేస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీ మూడు రాజధానుల అజెండాతోనే ప్రజలలోకి వెళ్తుంది. దీనికి ప్రజల నుంచి కూడా సానుకూల అభిప్రాయం వస్తుంది. అయితే విపక్షాలు మాత్రం కావాలని రాద్దాంతం చేస్తున్నాయి. అమరావతిని రాజధాని అంటూ చెబుతున్నారు. అయితే వైసీపీ విధానంలో అమరావతి కూడా శాసన రాజధానిగా ఉంటుంది. ఇక్కడి నుంచే చట్టాలు అమలు జరుగుతుంది. అలాగే అసెంబ్లీ సమావేశాలు కూడా అమరావతిలోనే జరుగుతాయి. అయితే పరిపాలన అంతా కూడా విశాఖ నుంచి చేయాలని చూస్తున్నారు. విశాఖపట్నం ఇప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతం కావడంతో పరిపాలనా రాజధాని అక్కడ ఉండటం వలన పరిశ్రమలకి కూడా మంచి సందేశాన్ని పంపించినవాళ్ళం అవుతామని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నారు.
విశాఖ చుట్టూ పరిశ్రమల స్థాపన కోసం పెట్టుబడీదారులు ముందుకి వస్తున్నారు. ఈ నేపధ్యంలో ఉగాది నుంచి విశాఖ నుంచి పరిపాలన ప్రారంభించాలని ముఖ్యమంత్రి జగన్ భావించారు. దానికి ప్రణాలికలు కూడా సిద్ధం చేశారు. అయితే ఈ నెల 14 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ సమావేశాల అనంతరం మార్చి 18 నుంచి వైసీపీ ఎన్నికల కార్యాచరణలో భాగంగా కొత్త కార్యక్రమం మొదలు పెట్టబోతున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకొని ఏప్రిల్ మొదటి వారంలో విశాఖకి జగన్ షిఫ్ట్ అవ్వాలని ప్లాన్ చేస్తున్నారు.
తన హౌస్, క్యాంప్ ఆఫీస్,, అలాగే సీఎంవో ఆఫీస్ కోసం మంచి సౌకర్యవంతమైన భవనలని రెడీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఐటీ మంత్రి అమర్ నాథ్ కూడా ఇప్పటికే దీనిపై క్లారిటీ ఇచ్చారు. త్వరలో విశాఖ నుంచి జగన్ పాలన ఉంటుందని తెలిపారు. ఇదిలా ఉంటే విశాఖలో జగన్ రెండు రోజులు స్టే చేస్తారు. అలాగే ఒక రోజు పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ప్రభుత్వ సంబందిత కార్యకలాపలై దృష్టి పెడతారని టాక్