Ap Government: మూడు రాజధానులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందిది. ఈ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మూడు రాజధానులు చెల్లవని, అమరావతినే రాజధానిగా కొనసాగించాలని గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. రాజధానిగా అమరావతి ఉండాలని ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేయాలని, శాసన వ్యవస్థను నిర్వీర్యం చేసేలా హైకోర్టు తీర్పు ఉందని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టును తీర్పుపై వెంటనే స్టే విధించాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది.
అభివృద్ధి వీకేంద్రీకరణ కోసమే మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నామని పిటిషన్ లో పేర్కొంది. మూడు రాజధానులపై అసెంబ్లీకి అధికారం లేదని హైకోర్టు చెప్పడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. రాజధాని స్థానాన్ని మార్చే అధికారం శాసనసభకు లేదని హైకోర్టు తెలిపిన విషయాన్ని పిటిషన్ లో ఏపీ ప్రభుత్వం పేర్కొంది. సీఆర్డీఏ చట్టం ప్రకారం చేయాలనండం అసెంబ్లీ అధికారాలను ప్రశ్నించడమేనని ప్రభుత్వం స్పష్టం చేసింది.
మూడు రాజధానులపై అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో రాజధానిని మార్చడం కుదరదని, శాననసభకు అధికారాలు లేవని హైకోర్టు తీర్పు ఇచ్చింది. అమరావతిని వెంనటే అభివృద్ధి చేయాలని, అమరావతిలో పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Ap Government:
కాగా మూడు రాజధానుల అంశాన్ని జగన్ వదిలిపెట్టడం లేదు. మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని ఇటీవల అసెంబ్లీలో సీఎం జగన్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. మూడు రాజధానుల బిల్లులను మళ్లీ ప్రవేశపెట్టే యోచనలో సీఎం జగన్ ఉన్నారు. త్వరలో బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెడతారని తెలుస్తోంది. వచ్చే నెల రానున్న దసరా నుంచి విశాఖ నుంచి జనగ్ పాలన కొనసాగిస్తారని ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరుగుతోుంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే జగన్ మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెడతారని ప్రచారం జరుగుతోంది. కానీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన జగన్.. న్యాయపరంగా వచ్చే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వెనక్కి తగ్గారు.