ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి రెండింటికీ సమ ప్రాధాన్యం ఇస్తున్నారని హోంమంత్రి తానేటి వనిత అన్నారు.
ఆదివారం కొవ్వూరు మున్సిపాలిటీలో 1.80 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను ఆమె ప్రారంభించి మాట్లాడుతూ.. కొవ్వూరులో మొత్తం 3 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. మరో 55 లక్షల విలువైన పనులు పూర్తయ్యాయని ఆమె తెలిపారు.
ఇందిరమ్మ హౌసింగ్ కాలనీలో మౌలిక వసతులు కల్పించామని మంత్రి వివరించారు. సీఎం చొరవతో ఇప్పటికే కాలనీ లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేశారు.
కొవ్వూరు మున్సిపల్ చైర్ పర్సన్ భావన రత్నకుమారి, మాజీ ఎమ్మెల్సీ శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.