AP Minister: మూడు రాజధానులపై ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో మూడు రాజధానుల అంశమే రిఫరెండెం అని వ్యాఖ్యానించారు. దీనిని బట్టి చూస్తే మూడు రాజధానుల బిల్లు త్వరలో అసెంబ్లీలో ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టడం ఖాయమని తెలుస్తోంది. మూడు రాజధానులే ప్రధాన ఎజెండాగానే వచ్చే ఎన్నికలను ఎదుర్కొబోతున్నట్లు అమర్ నాథ్ స్పష్టం చేశారు. మూడు రాజధానులే ప్రధాన ఎజెండాగా వచ్చే ఎన్నికల్లో ప్రజాభిప్రాయాన్ని కూడగడతాయని ఆయన అన్నారు. దీనిని బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో మూడు రాజధానులే అంశాన్ని రిఫరెండెంగా వైసీపీ ఫోకస్ చేస్తోంది.
అయితే టీడీపీ మాత్రం అమరావతికే కట్టుబడి ఉంది. అమరావతి రాజధానిగా రిఫరెండెంకు సిద్దమవుతుంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ మళ్లీ గెలిస్తే మూడు రాజధానులకు ప్రజలు సపోర్ట్ చేసినట్లు అవుతుంది. అదే టీడీపీ గెలిస్తే అమరావతికే ప్రజల మద్దతు ఉన్నట్ల స్పష్టమవుతుంది. ఎన్నిలకు ఇంకా రెండేళ్లు ఉండగానే ఎన్నికల రిఫరెండెంను పార్టీలు సెట్ చేశాయి. గుంటూరు కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార వైసీపీనే గెలిచింది. స్థానిక సంస్థల ఎన్నికలైన మున్సిపల్, సర్పంచ్ ఎన్నికల్లోనూ వైసీపీ గెలిచింది.
AP Minister:
దీంతో అమరావతిలోనూ తమ పార్టీకే మద్దతు ఉ:దని వైసీపీ చెబుతోంది. కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీలకే మద్దతు ఉంటుందని, సాధారణ అసెంబ్లీ ఎన్నికల నాటికి మూడ్ మారిపతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే రాజధాని అమరావతి ఉండాలని టీడీపీ నేతలు చెబుతున్నారు తప్ప.. వచ్చే ఎన్నికల్లో ప్రజల మద్దతు కూడగడుతున్నామని ఎక్కడా చెప్పలేదు. రాష్ట్రంలో జరిగిన అన్ని ఎన్నికల్లోనూ వైసీపీ గెలించింది. దీంతో మూడు రాజధానులకు ప్రజల మద్దతు ఉందని అనుకోవాలా అని వైసీపీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఏది ఏమైనా ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉండగానే రాజధానులపై హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. ఇక ఎన్నికల నాటికి అమరావతి ఉద్యమం మరింత ఉధృతమ్యే అవకాశముంది.