ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గ్రాఫ్ పుష్ప సినిమాతో ఏ రేంజ్కు వెళ్లిపోయిందో తెలిసిందే. పుష్ప అంత పెద్ద హిట్ అవ్వడం బన్నీకి ముఖ్యంగా నార్త్లో బాగా కలిసొచ్చింది. అటు సినిమాలతో పాటు ఇటు సోషల్ మీడియాలో కూడా అల్లు అర్జున్కి విపరీతమైన క్రేజ్ పెరిగింది ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లో ఆయన ఫాలోవర్ల సంఖ్య చూస్తే దిమ్మతిరిగిపోద్ది. ఇక తాజాగా మరో రికార్డ్ కొట్టేశాడు బన్నీ. అదేటంటే?
![రికార్డ్ సాధించిన తొలి ఇండియన్గా ..సోషల్ మీడియాలో బన్నీ తగ్గేదెలా .! 2 రికార్డ్ సాధించిన తొలి ఇండియన్గా ..సోషల్ మీడియాలో బన్నీ తగ్గేదెలా .!](https://rtvmedia.in/wp-content/uploads/2023/07/Untitled-design-2023-07-25T113511.481.jpg)
ట్విట్టర్ ,ఇన్స్టాగ్రామ్ కి పోటీగా ఈ మధ్యే థ్రెడ్స్ యాప్ లాంఛ్ అయింది. మొదటి వారంలోనే 10 కోట్ల యూజర్లను రాబట్టి దుమ్ముదులిపేసింది. ఇంది లాంఛ్ అయినప్పుడు ఈ ప్లాట్ఫామ్లో చేరిన మొట్టమొదటి తెలుగు నటుడిగా అల్లు అర్జున్ నిలిచాడు. ఇక తాజాగా థ్రెడ్స్లో మరో అద్భుతమైన ఫీట్ను సాధించాడు
ఇక కెరీర్ విషయానికొస్తే అల్లు అర్జున్ త్వరలోనే మళ్లీ పుష్ప 2 షూటింగ్ సెట్లో అడుగుపెట్టబోతున్నాడు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మొదటి పార్ట్ బంపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ముఖ్యంగా పాన్ ఇండియా లెవల్లో దీంతో మరో హిట్ కొట్టాలని బన్నీ చూస్తున్నాడు. ఈ సినిమా కోసం గట్టిగానే కష్టపడుతున్నాడు.
ఇక ఈ మధ్యే ‘బేబీ‘ చిత్రం సక్సెస్ మీట్కు ప్రత్యేక అతిథిగా బన్నీ వెళ్లాడు. అక్కడ అల్లు అర్జున్ మాట్లాడిన మాటలు బాగా వైరల్ అయ్యాయి. ఇండస్ట్రీకి తెలుగు అమ్మాయిలు హీరోయిన్లుగా రావడం చాలా ఆనందంగా ఉందని బన్నీ చెప్పాడు. వైష్ణవి లాంటి అమ్మాయిలు ఇండస్ట్రీకి వస్తే చాలా ఆనందపడతానని, ఇలాంటి వాళ్ల కోసం టాలీవుడ్ ఎదురుచూస్తుందని చెప్పుకొచ్చాడు. అలాగే తల్లిదండ్రులు కూడా అమ్మాయిలను ఎంకరేజ్ చేసి ఇండస్ట్రీకి పంపిచాలని.. ఇంత మంచి పరిశ్రమ ఎక్కడా లేదని గొప్పగా చెప్పాడు. తెలుగు సినిమాలో తెలుగు హీరోయిన్లు ఎందుకు రాలేరని తాను ఎప్పుడూ బాధపడుతూనే ఉన్నానని,. కానీ వైష్ణవి, శ్రీలీల రాకతో ఆ బాధ కాస్త తగ్గిందన్నాడు. ఇక బేబీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడం చాలా ఆనందాన్ని ఇచ్చిందని.. ఇలాంటి సినిమా ఇంకా చాలా రావాలని ఆశిస్తున్నట్లు చెప్పాడు.