ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో నిర్మాతలు అందరూ ప్రొడ్యూసర్ గిల్డ్ గా ఏర్పడి గత కొద్జి రోజులుగా సినిమా బడ్జెట్ కంట్రోల్ పై తీవ్రంగా చర్చలు జరుపుతున్నారు. ఇక ఆగష్టు 1 నుంచి సినిమా షూటింగ్ లు పూర్తిగా నిలిపేయాలని నిర్ణయించుకున్నారు. ఇక ఈ బడ్జెట్ కంట్రోల్ పై చర్చలు ఒక కొలిక్కి వచ్చిన తర్వాత షూటింగ్ ల సంగతి ఆలోచించాలని అనుకుంటున్నారు. ముఖ్యంగా ఈ చర్చలలో హీరోల రెమ్యునరేషన్ ల మీద ఎక్కువగా చర్చ జరుగుతుంది. ఇండియన్ వైడ్ గా చూసుకున్న ప్రస్తుతం తెలుగు స్టార్ హీరోలు ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. స్టార్ హీరోలు అయితే ఒక్కొక్కరు 50 కోట్లకి పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.
ఇక మీడియం రేంజ్ హీరోలు అయితే 15 నుంచి 30 కోట్ల వరకు తీసుకుంటున్నారు. ఇక హీరోల రెమ్యునరేషన్ లో కోత పెట్టాలని అనుకుంటున్నారు. అలాగే నిర్మాణ వ్యయం తగ్గించుకోవడానికి ఆర్టిస్ట్ ల రెమ్యునరేషన్ విషయంలో కూడా తగ్గించుకోవాలని అనుకుంటున్నారు. నటులు, టెక్నీషియన్స్ రెమ్యునరేషన్స్ కాకుండా సినిమా నిర్మాణ ఖర్చు రోజు రోజుకి పెరుగుతున్న నేపధ్యంలో ఇక బడ్జెట్ కంట్రోల్ అంతా రెమ్యునరేషన్స్ దగ్గరనే జరగాలని అనుకుంటున్నారు. ఆ దిశగానే ఆలోచిస్తున్నారు. మరో వైపు టికెట్ ధరలు ఎక్కువగా ఉండటంతో ప్రేక్షకులు థియేటర్స్ కి రావడానికి ఆసక్తి చూపించడం లేదు.
వీటిపై సీనియర్ బడా నిర్మాత అశ్వినీదత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిర్మాతల శ్రేయస్సు కోసం కోసం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఉండగా మరల ఈ గిల్డ్ ఎక్కడి నుంచి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. ప్రేక్షకులకి సినిమాలపై విరక్తి కలిగింది. వారిని థియేటర్స్ కి రప్పించడం ఇప్పుడు పెద్ద సవాల్. ముఖ్యమంత్రుల దగ్గరకి వెళ్లి టికెట్ ధరలు పెంచాలని డిమాండ్ చేసిన వారే ఇప్పుడు ఈ పరిస్థితికి కారణం అని విమర్శించారు. నిర్మాతలలో ప్రస్తుతం స్థిరత్వం లేదని కూడా అశ్వినీదత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ లో కలకలం రేపుతున్నాయి. అశ్వినీదత్ వ్యాఖ్యలపై ప్రొడ్యూసర్ గిల్డ్ ఎలాంటి కామెంట్స్ చేస్తుంది అనేది ఇప్పుడు వేచి చూడాలి.