అన్ని సినిమాలు కూడా బాగుంటాయని చెప్పలేము అలాగే కొన్నిసార్లు హిట్లు వస్తే కొన్నిసార్లు సినిమాలకి ఫ్లోప్స్ కూడా వస్తూ ఉంటాయి. అయితే ప్రస్తుతం మెగా హీరోలకి టైం అసలు కలిసి రావడం లేదని చెప్పుకోవచ్చు . 2023 సెకండ్ హాఫ్ మెగా హీరోలకి కలిసి రావట్లేదని బాగా తెలుస్తోంది. ఈ ఏడాది పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో మూవీ కి పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ కలెక్షన్స్ ని మాత్రం రాబట్టలేక పోయింది బ్రో మూవీ ఫుల్ రన్ కలెక్షన్లు 60 కోట్ల రూపాయలకి అటు ఇటు ఉండడంతో నిర్మాతలకి భారీగా నష్టం కలిగిందని తెలుస్తోంది.
![మెగా ఫ్యామిలీ కి బ్యాడ్ టైం.. అందుకే ఇలా…? 2 మెగా ఫ్యామిలీ కి బ్యాడ్ టైం.. అందుకే ఇలా…?](https://rtvmedia.in/wp-content/uploads/2023/08/Untitled-design-25-1.jpg)
ఇక చిరంజీవి భోళా శంకర్ మూవీ గురించి అయితే చెప్పక్కర్లేదు 30 కోట్ల కలెక్షన్లుని సాధించింది భోళా శంకర్ మూవీ భారీ నష్టాలను తీసుకువచ్చింది. ఇప్పుడు వరుణ్ తేజ్ గాండీవదారి అర్జున అనే మూవీ తో ప్రేక్షకులు ముందుకి వచ్చారు అని పాజిటివ్ టాక్ ని కూడా సొంతం చేసుకోలేకపోయింది . ఈ మూవీ నిర్మాతలకి మాత్రం భారీ ప్లాప్ ని ఇచ్చింది. ఇలా ఈ సినిమాలన్నిటిని చూస్తే అస్సలు మెగా ఫ్యామిలీకి కలిసి రావట్లేదని అర్ధం అవుతుంది . అలానే వరుణ్ తేజ్ కి కెరీర్ విషయంలో సరైన గైడెన్స్ బాగా ముఖ్యమని అంతా అంటున్నారు.