ఇండియన్ సినిమాలు హాలీవుడ్ మూవీస్ రిఫరెన్స్ తో తెరకెక్కుతూ ఉంటాయి. హాలీవుడ్ సినిమాలలో ఇంటరెస్టింగ్ పాయింట్ ని తీసుకొని దానిని ఇండియన్ నేటివిటీకి సింక్ చేస్తూ మన దర్శకులు కొత్త కథలని తెరకెక్కిస్తూ ఉంటారు. అయితే కొంత మంది అయితే రీమేక్ రైట్స్ సొంతం చేసుకొని హాలీవుడ్ కథలని ఇండియన్ బాషలలో తీస్తారు. కొంత మంది మాత్రం ఎలాంటి రైట్స్ తీసుకోకుండానే కాపీ చేసేస్తారు. అయితే ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ పెరగడంతో పాటు సినిమా అనేది డిజిటలైజేషన్ కావడంతో సినిమా కంటెంట్ ని కాపీ చేస్తున్నారా లేదా అనేది చాలా ఈజీగా తెలిసిపోతుంది.
అయితే ఇప్పుడు ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ కూడా పెరుగుతుంది. మాన దర్శకులు కొత్త రకం ఐడియాలని తెరపైకి తీసుకొస్తున్నారు. ఎమోషనల్ ఎలిమెంట్స్ మరింత క్రియేటివ్ గా రిప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అలాగే ఒక ఇండియన్ సినిమా నుంచి హాలీవుడ్ వెబ్ సిరీస్ లో రిఫరెన్స్ సీన్ ఒకటి వచ్చింది. గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ ఎంత సక్సెస్ అయ్యిందో అందరికి తెలిసిందే.
దీనికి ప్రీక్వెల్ గా హౌస్ ఆఫ్ ది డ్రాగన్ అనే వెబ్ సిరీస్ వచ్చింది. ఈ వెబ్ సిరీస్ కి సంబందించిన ఎపిసోడ్స్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో ఉన్నాయి. ఇందులో ఎనిమిదో ఎపిసోడ్ లో బాహుబలి 2 సినిమాలోని సేనాపతిని అమరేంద్ర బాహుబలి రాజమందిరంలోనే చంపే సీన్ ఉంటుంది. ఆడవాళ్ళని అవమానించాడని అతన్ని చంపేస్తాడు. ఈ సీన్ ని యాజ్ టీజ్ గా హౌస్ ఆఫ్ ది డ్రాగన్ లో పెట్టేసారని సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ఇక ఈ వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహించింది. ఇండియన్ బ్యాగ్రౌండ్ ఉన్న గీత వి పటేల్ దర్శకత్వం వహించడం విశేషం.