Balakrishna: అటు రాజకీయాలు, ఇటు సినిమాలతో నిత్యం బిజీగా ఉంటారు నటసింహం నందమూరి బాలకృష్ణ. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న సినిమాలో బాలకృష్ణ నటిస్తున్నారు. సినిమాలు, రాజకీయాలే కాదు.. టాక్ షోలతోనూ బాలయ్య అదరగొడుతున్నారు. ఓటీటీ యాప్ ఆహాలో ప్రసారమయ్యే అన్ స్టాపబుల్ షోను బాలకృష్ణ నిర్వహిస్తున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న సినిమాలో.. బాలయ్య చాలా పవర్ ఫుల్ రోల్ లో కనిపిస్తున్నారు.
ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన స్టిల్స్, టీజర్ ప్రక్షకులను ఆకట్టుకుంటున్నాయి. బాలయ్యకు జోడీగా శృతి హాసన్ నటిస్తోంది. మరో ముఖ్యమైన పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. త్వరలోనే సినిమా పేరును ఖరారు చేయనుంది చిత్ర బృందం.
బాలయ్య నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయితే.. ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడితో కలిసి కొత్త ప్రాజెక్టు మొదలు పెట్టనున్నారు బాలకృష్ణ. అనిల్ రావిపూడి కామెడీ టైమింగ్స్ బాలయ్యకు కలిసొస్తాయని ఇప్పటి నుంచే ఎక్స్ పెక్టేషన్స్ మొదలయ్యాయి. తాజాగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న చిత్రం నుంచి సాలిడ్ అప్ డేట్ వచ్చింది. దీపావళి కానుకగా బాలయ్య సినిమా పేరును ఖరారు చేయనున్నారు.
Balakrishna
దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో బాలయ్య సూపర్బ్ డైలాగ్ తో ఆకట్టుకున్నారు. ‘నరకడం మొదలు పెడితే.. ఏ పార్ట్ ఏదో మీ పెళ్లాలకు కూడా తెలియదు నా కొడకల్లారా.. అంటూ టీజర్ లో బాలయ్య చెప్పిన డైలాగ్ పేలుతోంది. మాస్ గూస్ బంప్స్ వస్తున్నాయంటూ అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈరోజు రాత్రి 8.15 నిమిషాలకు టైటిల్ ను అనౌన్స్ చేయనున్నారని తెలుస్తోంది.